మిత్రధర్మాన్ని బీజేపీ పక్కన పెట్టబోతోందా? ఇక సొంతంగా తెలంగాణలో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా? విమోచన దినాన్ని బీజేపీ అట్టహాసంగా నిర్వహించడం వెనుక అసలు వ్యూహం ఏమిటి? టీడీపీ, కాంగ్రెస్లు ఢీలా పడిపోయిన సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వరంగల్ పర్యటన ఆ పార్టీకి ఎంత వరకూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే సమయంలో టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజేపీ పడిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి! తెలంగాణలో ప్రధాని మోడీ తొలి పర్యటన సూపర్ […]
Category: Politics
పవన్తో బీజేపీ రాజీ యత్నాలు
హోదా ప్రకటించనందుకు ఏపీ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో దూరమవుతున్న మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడింది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తీవ్ర స్వరంతో బీజేపీపై విరుచుకుపడుతున్నాడు. దశల వారీ పోరాటానికి కార్యాచరణ కూడా ప్రకటించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భవిష్యత్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే పవన్ రంగంలోకి దిగకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జనసేనానితో రాయబారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]
కేసీఆర్ రియల్ మాయలో పడ్డారా
రియల్ ఎస్టేట్ మాయ అంతా ఇంతా కాదు. ఒక్కసారి హిట్టయ్యామా.. వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అంతేకాదు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్ పడిందంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా పబ్లిక్ టాక్! ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. అధికారులతో ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా.. రియల్ ఎస్టేట్ గురంచే కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం రాష్ట్రంలోని […]
మురళీమోహన్ వారసురాలు వస్తోంది!
ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి! 2019 ఎన్నికల్లో తమ కొడుకులు, కూతుళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటినుంచే సీనియర్ నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ తరుణంలో తన కోడలిని రాజకీయ వారసులిగా తీసుకొస్తున్నారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్!! భవిష్యత్తులో రాజమండ్రి ఎంపీగా ఆమెతో పోటీచేయించేందుకు ఇప్పటినుంచే ఆమెను సిద్ధం చేస్తున్నారు! తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్కుమర్..కు ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. […]
పొత్తుల కోసం జగన్ తహతహ
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. అయితే ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్.. సొంతంగా పోటీచేస్తానని ప్రకటించాడు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఈ సారి ఎలాగైనా `సీఎం` పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సొంతంగా పోటీచేసేకంటే ఎవరో ఒకరిని కలుపుకుని వెళితే సీఎం అయిపోవచ్చని భావిస్తున్నారు. అందుకే అటు జనసేన, ఇటు వామపక్షాలతో పొత్తు కోసం […]
చంద్రబాబుకు అక్కడ చుక్కలే
ప్రస్తుత రాజకీయాల్లో అపార రాజకీయ అనుభవమున్న నేత ఎవరంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్రబాబు! రాజకీయ వ్యూహాలు రచించి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అయనకు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయనకే ఒక జిల్లాలో రాజకీయాలు చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా పరిస్థితులు దిగజారిపోతున్నాయట. ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గ రాజకీయాలే ఇందుకు కారణమని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదంటే […]
వెంకయ్యా ఈ కుప్పి గంతులేందయ్యా..
`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామపక్షాలపై విమర్శలు గుప్పించాలన్నా ఆయన తర్వాతే!! `ఆకాశంలో స్కామ్, నీటిలో స్కామ్, గాలిలో స్కామ్ ఇలా వారి హయాంలో అన్నింటిలోనూ స్కామ్లే` అని కాంగ్రెస్ను ఏకిపారేయాలన్నా ఆయన తర్వాతే!! ప్రాసలు, పంచ్లు.. మాటల తూటాలతో దాడి చేస్తారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో పోరాడిన ఆయనే ప్యాకేజీతో ఏపీకి లాభమని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని ప్లేట్ ఫిరాయించారు! విశాఖకు రైల్వే జోన్ వచ్చేలా కృషిచేస్తానని […]
మోడీ పొగిడారు, అమిత్ షా విమర్శించారు.
రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కెసియార్ని విమర్శించారు. కెసియార్ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]
ఎడ్యుకేట్ చేస్తున్న వెంకయ్య.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]