అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు […]

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]

హుజూరాబాద్ బై పోల్స్.. ఎన్నికల సంఘానికి టెన్షన్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో.. త్వరలో జరిగే ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు బాటకు ఎవరికి వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. ఉద్యమకారులు, నిరుద్యోగులు, నేతన్నలు ..ఇలా ప్రభుత్వంపై ఆక్రోశం ఉన్న వారంతా తాము నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సత్తా చూపాలంటే హుజూరాబాద్ లోనే చూపాలని.. అప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని వారి భావన. దాదాపు 2200 మంది హుజూరాబాద్ […]

కోర్టు ఖర్చులకే కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఎలా..?

1,2 కాదు.. ఏకంగా 58 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు ఖర్చు పెట్టింది. అదేం ప్రజాప్రయోజనాల కోసం కాదు.. కోర్టు ఖర్చుల కోసమట.. ఈ విషయం తెలిసీ కోర్టు కూడా నివ్వెరపోయింది..ఇదేంటి.. ఇంత మొత్తం ఖర్చు పెట్టారు అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్ కార్యదర్శులకు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఈ […]

శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]

రేవంత్ లో అయోమయం.. అందుకే రాహుల్ రాక..

హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో కారు దూసుకుపోతుంటే.. బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు అభ్యర్థిని ప్రకటించికపోయినా వారికో క్లారిటీ ఉంది. ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఎవరు అనే విషయం కొలిక్కి రాలేదు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించినా […]

కేసీఆర్ పొలిటికల్ స్టెప్.. ఊహించని ట్విస్ట్

దళితబంధు.. కేసీఆర్ మానసపుత్రిక..ఈనెల 16న హుజూరాబాద్ లో ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు.. అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారమే ప్రారంభించారు.. దళిత బంధును ఆయన దత్తత గ్రామంలోనే ప్రారంభించారు. ఈనెల 16న జరిగే కార్యక్రమం కేవలం లాంఛనమే అని.. అధికారికంగా వాసాలమర్రిలోనే ప్రారంభమైందని నేరుగా సీఎమ్మే కుండబద్దలు కొట్టారు. ఉన్నట్టుండి సీఎం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాదు.. ఆ డబ్బు (రూ.10 లక్షలు) బుధవారమే వారి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీంతో ఆ గ్రామంలోని […]

అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?

ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది.   ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా […]

పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]