కౌశిక్ ఇంకా ఎమ్మెల్సీ కాలేదు.. రాజ్ భవన్ ఇంకా ఆమోదించలేదు..

కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ లో పోటీచేస్తానంటూ మాట్లాడి.. ఆ విషయం బయటకు తెలిసిన అనంతరం కారెక్కిన వ్యక్తి. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ అతన్నే ఈటలపై పోటీకి దించుతుందని భావించారు. అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఆరు రోజులకే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ కేబినెట్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లింది. […]

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]

ఏపీ సర్కారుకు మరో సలహాదారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]

ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]

మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]

ద్వితీయశ్రేణి కేడర్ లో అసంతృప్తి.. గుర్తించని గులాబీ బాస్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం […]

హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ

’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ […]

ఆంధ్రలో కొత్త కరోనా రూల్స్..?

కరోొనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ రాబోయే ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా రూల్స్ ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టక తప్పలేదు. ఏపీలో అయితే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీలో సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల […]