’కడియం‘ మాటలు వినిపించాయా సారూ..!

దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు. జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన […]

ఇక నుంచి ఆ స్కూళ్ల‌లో బాలిక‌ల‌కు ఎంట్రీ: మోదీ

భారత ప్రధాని నరేంద్ర‌మోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్‌లో గర్ల్స్‌కు ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది బాలిక‌లు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలిక‌ల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ త‌లుపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ప్ర‌ధాని మోడీ స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం […]

కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ […]

మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!

ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్‌ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. ఈనేపథ్యంలో దళిత […]

ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?

వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

సభకు నేను రాలేను బాస్.. గోవా వెళుతున్నా..

ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో కూడా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ను విమర్శిస్తూ దూకుడు పెంచింది. అయితే రేవంత్ లీడర్షిప్ లో సభలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హాజరుకాకుండా తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇపుడు ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికే ఫోన్ […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]