ప్రకాశం వైసీపీలో యువ డాక్టర్ రాజకీయం..సీటు కోసమే..!

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ జగన్ సీటు ఇస్తారా? అంటే అది ఏ మాత్రం జరగని పని చెప్పవచ్చు. ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కన పెట్టడం గ్యారెంటీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే జగన్ ఆ మేరకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇదే క్రమంలో కొందరు ఆశావాహులు సీటు పై ఆశలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. […]

గుడివాడలో కీ టర్నింగ్..టీడీపీలో ట్విస్ట్‌లు.!

రాష్ట్ర రాజకీయాలని ఆకర్షించే గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీలో పరిస్తితులు అర్ధం కాకుండా ఉన్నాయి. గుడివాడలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. కానీ ఎక్కడా కూడా కొడాలికి చెక్ పెట్టలేకపోతుంది. అభ్యర్ధులని మార్చిన ఫలితం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అభ్యర్ధిని మారుస్తారనే ప్రచారం వస్తుంది. దీంతో టీడీపీ సీటు విషయంపై క్లారిటీ లేదు. కానీ […]

రాజధాని వ్యూహం..ఆ రెండే జగన్ టార్గెట్..!

అధికారంలోకి రాగానే జగన్..అమరావతిని రాజధానిగా కాదు అని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా చేసి..విశాఖని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిర్ణయం తీసుకుని మూడేళ్లు అయింది..కానీ మూడేళ్లలో మూడు రాజధానుల కోరిక నెరవేరలేదు. ఈ రాజధాని అంశంపై ఈ మూడేళ్లు ఎలాంటి రచ్చ నడిచిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్తితి ఏపీ ప్రజలకు వచ్చింది. ఇలా రాజధానిపై […]

వారసుల కోసం జేసీ రీ ఎంట్రీ..రెండు సీట్లే టార్గెట్..!

కాంగ్రెస్ పార్టీలో ఉండగా జేసీ దివాకర్ రెడ్డి..అనంతపురం జిల్లాలో కీలకమైన నేత అనే సంగతి తెలిసిందే. వరుసపెట్టి తాడిపత్రి నుంచి గెలిచిన దివాకర్…రాష్ట్ర విభజన తర్వాత తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది..జేడీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని రంగంలోకి దింపింది. తాడిపత్రి నుంచి ప్రభాకర్ తనయుడు […]

తెలంగాణ టీడీపీలో జోష్..ఖమ్మంలో బాబు..భారీ వ్యూహం.!

చాలా రోజుల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త జోష్ కనిపిస్తోంది..రాష్ట్ర విభజన తర్వాత…ఆ పార్టీని నేతలు వరుసపెట్టి వీడిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ సైతం పార్టీని వీడారు. దీంతో ఇంకా టీడీపీకి ఎండ్ కార్డు పడిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత బక్కని నర్సింహులుని అధ్యక్షుడుగా పెట్టారు గాని..పెద్దగా ప్రయోజనం లేదు. ఇక దీంతో తెలంగాణలో టీడీపీ పేరు వినబడటం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ […]

ఆళ్లగడ్డ వైసీపీలో ట్విస్ట్..గంగులకు సొంత రిస్క్..!

గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల రంగంలోకి దింపి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సక్సెస్ అయిన వారిలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్ నేత అయిన గంగుల..2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు తన తనయుడు బిజేంద్రరెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక జగన్ వేవ్‌లో బిజేంద్ర భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియపై గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఓ […]

జగన్‌తో విశాల్..బాబుకు టెన్షన్..కుప్పంపైనే గురి.!

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తమిళ నటుడు విశాల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా తెలుగువాడైన విశాల్..తమిళనాడు వెళ్ళి అక్కడ హీరోగా సెట్ అయిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త జి‌కే రెడ్డి అనే సంగతి తెలిసిందే..వీరిది చిత్తూరు జిల్లా. అలాగే కుప్పంలో అంతకముందు వ్యాపారాలు కూడా చేశారు. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో విశాల్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున కుప్పంలో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. […]

ఆ మంత్రి వారసుడుకు సీటు ఫిక్స్..కానీ.!

గడపగడపకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జ్‌లు ఖచ్చితంగా తిరగాల్సిందే అని, వారసులు తిరిగితే దాన్ని కౌంట్ చేయమని చెప్పి జగన్ ఇప్పటికే పలు వర్క్ షాపుల్లో చెప్పిన విషయం తెలిసిందే.  అలాగే వారసులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ తనతో ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటలని కొందరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కొందరు ఆరోగ్య రీత్యా, మరికొందరు వయసు రీత్యా నెక్స్ట్ […]

రాజాం సీటులో గ్రీష్మ..చినబాబు గ్రీన్ సిగ్నల్?

ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో […]