ఒక్క సినిమాలో త్రిబుల్ రోల్ ప్లే చేయడం అంటే టాలీవుడ్ హీరోలు చాలా ఇష్ట సడుతూ ఉంటారు. అది చాలా సాహసంతో కూడుకున్న పని అయినా ఎంతో సంతోషంగా సినిమాను యాక్సెప్ట్ చేసి నటిస్తూ ఉంటారు. అలా గతంలో అక్కినేని నాగేశ్వరరావు ఏకంగా నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రలో నటించి మెప్పించాడు. ఇలా ఒకేసారి 9పాత్రలు పోషించిన అక్కినేని టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించాడు. ఇదే సినిమాను శివాజీ గణేషన్ రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రలను పోషించి అక్కినేని, శివాజీ గణేషన్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఆ తరువాత ఎన్టీఆర్ 1997లో దానవీరశూరకర్ణ సినిమాలో త్రిబుల్ రోల్ ను ప్లే చేసి సంచలన సక్సెస్ అందుకున్నాడు. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలలో మెప్పించి రికార్డులు సృష్టించాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన విరాటపర్వంలో ఏకంగా ఐదు పాత్రలో మెప్పించాడు. కీచకుడు, అర్జునుడు, గృహాలుడు, కృష్ణుడు, దుర్యోధనుడిగా ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణ కూడా కుమార రాజా సినిమాలో నా త్రిబుల్ రోల్ లో ప్లే చేశాడు. తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకులు పాత్రలోనూ నటించి మెప్పించాడు.
కృష్ణ ట్రిపుల్ రోల్ లో ఏకంగా ఏడు సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశాడు. శోభన్ బాబు కూడా ముగ్గురు మొనగాళ్లు సినిమాతో మూడు పాత్రలో నటించాడు. అది నాయకుడు సినిమాలో బాలకృష్ణ, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో ట్రిపుల్ రోల్లో నటించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇలా ఈ ఆరుగురు హీరోలు ఇప్పటివరకు టాలీవుడ్ లో ట్రిపుల్ రోల్ లో నటించి మెప్పించడమే కాదు భారీ సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత మరే హీరో కూడా ట్రిపుల్ రోల్ లో నటించే సాహసం చేయలేదు.