ఈయనే బాబా రాందేవ్ బెక్ హామ్..

ఎప్పుడూ రోటీన్ యోగానేనా.. కాస్తంత డిఫెరెంట్‌గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామ‌నుకున్నారు… ఏమో యోగా గురు బాబా రాందేవ్. ఒక్కసారిగా ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫుట్‌బాల్ స్టేడియంలో ట్రేడ్ మార్క్ దుస్తులైన కాషాయం దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చారు.. అయితే యోగా చేసేందుకు కాదు.. ఫుట్‌బాల్ ఆడేందుకు..పార్లమెంటేరియ‌న్ల‌కు బాలీవుడ్ స్టార్లకు మ‌ధ్య జ‌రిగిన ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఇలా మెరిశారు బాబా రాందేవ్‌. బాలీవుడ్ స్టార్ల‌కు అభిషేక్ బ‌చ్చన్ నాయ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ జ‌ట్టులో ర‌ణ్‌బీర్ […]

ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]

కార్నర్‌ అయ్యింది హరీష్‌రావే

మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్‌ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్‌ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ […]

చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్

ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]

కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు

మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]

1st డే తమిళ్ 100 కోట్లు మొత్తం 250 కోట్లా?

రజినీకాంత్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా జరిగిన మాట వాస్తవమే.రిలీజ్ కి ముందు ఇంతక ముందెన్నడూ ఏ సినిమాకి రాని హైప్ సూపర్ స్టార్ సినిమాకి వచ్చింది.ఇంకేముంది కలెక్షన్స్ పంట పండుతుందని అందరు ముందుగానే ఊహించారు. అయితే మొదిటి షో అయ్యే సరికే టాక్ బయటొచ్చేసింది.కొందరు డిజాస్టర్ అంటుంటే ఇంకొందరు పర్లేదని సరిపెడుతున్నారు తప్ప సినిమా సూపర్ అని అన్న నాధుడే లేదన్నది నిర్వివాదాంశం.ఇలాంటి తరుణం లో నిర్మాత చెప్తున్న కలెక్షన్ లెక్కలు కళ్ళు […]

థమన్ కి ‘మెగా’ టెన్షన్

యువ సంగీత సంచలనం అనిపించుకున్న ఎస్ ఎస్ తమన్ కు.. అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నవి తక్కువ సినిమాలే. ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆగస్ట్ 13న రిలీజ్ అవుతున్న తిక్క సినిమాలకు తమన్ బాణీలు సమకూర్చాడు. ఈ రెండు తప్ప అతడి చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేని స్థితి. ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు.. మెగా […]

చంద్రబాబు ఈసారి రిస్క్‌ చేయదలచుకోలేదు

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్‌ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా […]

తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు

తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్‌ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను […]