ఈయనే బాబా రాందేవ్ బెక్ హామ్..

ఎప్పుడూ రోటీన్ యోగానేనా.. కాస్తంత డిఫెరెంట్‌గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామ‌నుకున్నారు… ఏమో యోగా గురు బాబా రాందేవ్. ఒక్కసారిగా ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫుట్‌బాల్ స్టేడియంలో ట్రేడ్ మార్క్ దుస్తులైన కాషాయం దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చారు.. అయితే యోగా చేసేందుకు కాదు.. ఫుట్‌బాల్ ఆడేందుకు..పార్లమెంటేరియ‌న్ల‌కు బాలీవుడ్ స్టార్లకు మ‌ధ్య జ‌రిగిన ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఇలా మెరిశారు బాబా రాందేవ్‌.

బాలీవుడ్ స్టార్ల‌కు అభిషేక్ బ‌చ్చన్ నాయ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ జ‌ట్టులో ర‌ణ్‌బీర్ క‌పూర్, అర్జున్ క‌పూర్,డీనో మోరియా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రలాంటి స్టార్లు ఉన్నారు. మ‌రోవైపు ఎంపీల జ‌ట్టుకు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో నాయ‌క‌త్వం వ‌హించారు. ఎంపీల జ‌ట్టులో మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రసూన్ బెన‌ర్జీతో పాటు మ‌నోజ్ తివారీ,ప‌ర్వేజ్ వ‌ర్మ‌,క‌మ‌లేష్ ప‌వ‌న్,స‌తీష్ గౌత‌మ్‌,భోలా సింగ్‌,దుశ్యంత్ చౌతాలా, తెలుగు దేశానికి చెందిన యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఉన్నారు.

ఆధునిక్ అనే ఓ ప్రైవేట్ ఆర్ట్ గ్యాల‌రీ ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. మ్యాచ్ టికెట్ల రూపంలో వ‌చ్చిన డ‌బ్బును స్వచ్చ్ భార‌త్ మిష‌న్‌, భేటీ బ‌చావో-భేటీ ప‌డావో కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు విరాళంగా ఇవ్వనున్నారు. ప్రధాని న‌రేంద్ర మోడీ పెట్ ప్రాజెక్టులు అయిన స్వఛ్చ్ భార‌త్ మిష‌న్‌, భేటీ బ‌చావో-భేటీ ప‌డావో కార్యక్రమాల‌ను ప్రమోట్ చేసేందుకు స్టేడియంకు వ‌చ్చారు ఈ యోగా గురు. ఫుట్‌బాల్ ఆడి స్టేడియంలోని ప్రేక్షకుల‌ను అల‌రించడ‌మే కాదు స్పెష‌ల్ అట్రాక్షన్‌గా నిలిచారు