“కేవీపీ రామచంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలకే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు సైతం తెలుసు. సిద్ధాంతపరంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేతల మధ్య మంచీ దోస్తీ ఉందనే వార్తలు కొద్దికాలంగా వెలువడుతున్నాయి. అయితే ఇది మరింతగా బలపడిందని […]
Category: Latest News
రోశయ్యకు పదవీ గండం…
తమిళనాడు గవర్నర్గా ఉన్న కొణిజేటి రోశయ్య.. త్వరలోనే ఇంటి ముఖం పడతారా? ఆయనకు పదవీ గండం పొంచి ఉందా? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశయ్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించిన రోశయ్యకు అదే అధిష్టానం తమిళనాడు గవర్నర్ పదవిని అప్పజెప్పి గౌరవించింది. దీంతో 83 ఏళ్ల రోశయ్య తమిళనాడుకు 18వ గవర్నర్గా 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో సీఎం జయ లలితకు, గవర్నర్కు […]
రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?
సూపర్స్టార్ రజనీకాంత్తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్లో ఆయన షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]
కొత్త జిల్లాలు దసరాకే పక్కా
తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]
మహేష్ మారిపోయాడు
మామూలుగా మహేష్ పబ్లిక్కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్కి అనుకూలంగా ఉండడు సూపర్ స్టార్. అలాంటిది తన షూటింగ్ని పబ్లిక్లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్లో చాలా మార్పులే వచ్చాయి. తాజాగా మురుగదాస్తో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ని హైద్రాబాద్లో సిబియస్ లో నిర్వహించారు. అక్కడ మహేష్ షూటింగ్కి ఫ్యాన్స్ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ […]
‘శ్రీరస్తు శుభమస్తు’ శాటిలైట్ ఎంతో తెలుసా?
అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రం లాభాలు రాబడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. జెమినీ టీవీ రూ.3 కోట్లు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. ఈ మొత్తంతో సినిమా సగం బడ్జెట్ కవరైపోయింది. విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తుండటం,కుటుంబ ప్రేక్షకులు […]
నాని విరహ గీతం
రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు భలే వస్తాయి నానికి అంటూ తన తోటి హీరోలు ఎప్పుడూ అసూయ పడుతూనే ఉంటారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలోని మతిమరుపు క్యారెక్టర్ అందుకే అంత దగ్గరయ్యింది ప్రేక్షకులికి. ఒక్క భలే భలే మగాడివోయ్లోనే కాకుండా, నాని నటించే ప్రతీ పాత్రలోనూ సగటు మనిషి తనకు తాను ఆ పాత్రలో విలీనం అయిపోయి ఎంజాయ్ చేసేలానే ఉంటుంది నాని సినిమాలోని ప్రతీ పాత్ర. అసలే నేచురల్ యాక్టింగ్, […]
నయీం ఎన్కౌంటర్పై స్పందించిన దినేష్రెడ్డి
నయీం ఎన్కౌంటర్, నయీం గ్యాంగ్స్టర్గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్రెడ్డి. ఇలాంటి ఎన్కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]
ఎన్టీయార్ మనసున్నోడు
ఎన్టీయార్ మనసున్నోడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం అనే గుణాన్ని వంటబట్టించుకున్నోడు. అందుకే, పెద్ద మనసుతో తన సినిమా రిలీజ్ రోజున తన కటౌట్లకు క్షీరాభిషేకం చేయవద్దని పిలుపునిచ్చాడు. క్షీరాభిషేకం కోసం వినియోగించే పాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, పేదలకు పంచాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఎన్టీయార్. తన కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ ఆడియో విడుదల వేడుకలో ఎన్టీయార్ హుందాతనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల […]