మహేష్‌ మారిపోయాడు

మామూలుగా మహేష్‌ పబ్లిక్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్‌కి అనుకూలంగా ఉండడు సూపర్‌ స్టార్‌. అలాంటిది తన షూటింగ్‌ని పబ్లిక్‌లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్‌లో చాలా మార్పులే వచ్చాయి.

తాజాగా మురుగదాస్‌తో మహేష్‌ చేయబోయే సినిమా షూటింగ్‌ని హైద్రాబాద్‌లో సిబియస్‌ లో నిర్వహించారు. అక్కడ మహేష్‌ షూటింగ్‌కి ఫ్యాన్స్‌ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. వీలయినంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ పనులు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో ఉంది చిత్ర బృందం. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా కోసం మహేష్‌ ఓ డిఫరెంట్‌ గెటప్‌ ట్రై చేస్తున్నాడన్న టాక్‌ వినవస్తోంది. అదేమిటి? అనేది మాత్రం ఎవరికీ తెలియడంలేదు. పలు రకాల గెటప్స్‌ని ప్లాన్‌ చేసి, అందులో ఓ గెటప్‌ని ఫైనల్‌ చేయడానికి చాలా టైమ్‌ తీసుకున్నారట మహేష్‌, దర్శకుడు మురుగదాస్‌. అలాగే సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్‌జె సూర్య కూడా న్యూ లుక్‌తో కనిపిస్తాడట. ఈ లుక్‌ ద్వారా ఎస్‌జె సూర్య పండించే విలనిజం వెండితెరపై సరికొత్తగా ఉంటుందంటున్నారు.