చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అనే రూల్ ఉండాదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో- హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఆ క్రమంలోనే వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా సమంత – తారక్ ఇదివరకే సినిమాలు చేసి ఉండడంతో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగానే నడిచింది. అయితే తారక్- నిత్యామీనన్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎంతో నేచురల్ గా నటించింది అంటూ తారక్ ఆ సినిమా ప్రమోషన్స్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు వీళ్ళకి సంబంధించిన పలు ఇంటర్వ్యూ కూడా గతంలో వైరల్అయి. నిత్యామీనన్ తో ఎప్పుడు నటించే అవకాశం వచ్చిన అస్సలు మిస్ చేసుకోనని ..సావిత్రి గారి తర్వాత నాకు అంతలా నచ్చిన హీరోయిన్ ఆమె అని సమంత ముందే చెప్పుకొచ్చాడు.
ఆ టైంలో సమంత కూడా తారక్ ను ఆటపట్టించిన వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంది. అయితే తారక్ ఏ హీరోయిన్ తో అంత చనువుగా మూవ్ అవ్వడని ..కేవలం నిత్యామీనన్ పై అలాంటి పాజిటివ్ కామెంట్స్ చేయడంతో అతని భార్య లక్ష్మి ప్రణతి సైతం షాక్ అయిందని ..లక్ష్మీ ప్రణతి దగ్గర కూడా నిత్యామీనన్ గురించి చాలా గొప్పగా పొగడారని తెలుస్తుంది. ఈ జంట మరో సారి తెర పై నటిస్తే చూడాలి అన్నీటాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది.