ఒకే ఒక్క పోస్టుతో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తున్న రష్మిక మందన్నా.. మీకు అర్థం అవుతుందా..?

రష్మిక మందన్నా.. ఇండస్ట్రిలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న బ్యూటీ. ఛలో అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఇంట్రడ్యూస్ అయింది . ఈ ఒక్క సినిమాతో ఆమె తన తలరాతను ఆమె మార్చేసుకుంది . ఎంతలా అంటే ఆమె పేరు పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. పుష్ప నే ఆ ఘనత అందుకోవడానికి కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్నా.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది .

రీసెంట్గా రష్మిక మందన్నా.. తాను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఇంటిని మిస్ అవుతున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన జనాలు కొత్త డౌట్లు వ్యక్తం చేస్తున్నారు . నువ్వు మిస్ అవుతున్నాను అని పెట్టిన పోస్ట్ మీ తల్లిదండ్రుల గురించా..? లేక నీ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గురించా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అంతగా మిస్ అవుతుంటే షూటింగ్స్ కి బ్రేక్ చెప్పే ఇంటికి వెళ్ళు ..దీనికేం మాయ రోగం అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ పై ఆమెకున్న ప్రేమను రెట్టింపు అనుమానాలు కలిగేలా చేస్తుంది. రష్మిక పెట్టిన పోస్ట్ ఎవరి గురించి తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ రష్మికల ప్రేమాయణానికి సంబంధించిన విషయాలు మరోసారి హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతున్నాయి . ఈ జంట ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే అలాంటిది ఏదీ లేదు అంటూ కొట్టి పడేశారు రష్మిక – విజయ్ పలు సందర్భాలలో ..కానీ వాళ్ళ మధ్య ప్రేమ ఉంది అనే విషయాన్ని మాత్రం బయట పెడుతూనే వచ్చారు..!!