జ‌గ‌న్‌ని ఏకేసిన ఆ మీడియా

నంద్యాల ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రువు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా బ‌జారున ప‌డింది. జాతీయ మీడియా జ‌గ‌న్‌ను ఏకిపారేసింది. ఎందుకింత అహంభావం! అంటూ నిప్పులు చెరిగింది. సీఎంనే కాల్చిపారేయాల‌న్న జ‌గ‌న్‌ని జ‌నం త‌మ ఓట్లతో కాల్చేశారంటూ ఎద్దేవా చేసింది. రాజ‌కీయాల్లో ప‌రిణితి సాధించ‌లేని నేత‌.. రేపు అధికారంలోకి వ‌స్తే.. పాల‌న‌లో ఏం ప‌రిణితి చూపిస్తాడంటూ.. నిప్పులు చెరిగింది. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేసింది. రాజ‌కీయంగా ఎలా వ్య‌వ‌హ‌రించాలో? […]

న్యాయ‌మూర్తుల‌తో బాబు కుమ్మ‌క్కా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఆంగ్ల ప‌త్రిక ఎక‌న‌మిక్ టైమ్స్ బాంబు పేల్చింది. న్యాయ వ్య‌వ‌స్థ‌పై బాబు పెత్త‌నం చేస్తున్నార‌ని, త‌న‌కు అనుకూలంగా ఉండ‌ర‌ని భావించే కొంద‌రు న్యాయ‌వాదుల‌కు ప్ర‌మోష‌న్ రాకుండా అడ్డుకుంటున్నార‌ని ఈ క‌థ‌నం సారాంశం. నిజంగా ఈ క‌థ‌నం నిజ‌మైతే.. బాబు తీవ్ర చిక్కుల్లో ప‌డ్డ‌ట్టేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. దేశంలోని అన్ని హైకోర్టుల‌కు న్యాయ‌మూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్ర‌ప‌తి ఆమోదంతో ఆయా గ‌వ‌ర్న‌ర్లు.. ప్ర‌మాణ […]

గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ ప‌డిందంటే…

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వ‌రూ ఊహించ‌ని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గోస్పాడు మండ‌లంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వ‌స్తుంద‌ని, ఆ మండ‌లం నుంచి వ‌చ్చే మెజార్టీయే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. చాలా నివేదిక‌లు, స‌ర్వేలు, చివ‌ర‌కు ప్ర‌శాంత్ […]

చంద్ర‌బాబు స‌త్తా మ‌రోసారి రుజువైందిగా

ఎన్నిక‌ల్లో తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని.. ఎంతటి వారైనా త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చిత్త‌వ్వాల్సిందేన‌ని రుజువుచేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. 15 రోజులు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. నంద్యాల‌లోనే ఉండి ప్ర‌చారం చేసినా.. విజ‌యం సాధించ‌లేక‌పోయారు! ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు.. మాత్రం త‌న వ్యూహాల‌ను ప‌క్కాగా అమ‌లుచేస్తూ.. త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్నారు. త‌న‌కు ఎవ‌రి మ‌ద్ద‌తు లేక‌పోయినా.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి నంద్యాల‌లో స‌త్తా […]

నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. […]

పీకే ప్రాధాన్యం వైసీపీలో త‌గ్గిన‌ట్టేనా?

పార్టీలో నేత‌లు ఎంత మంది వ‌ద్ద‌ని చెప్పినా విన‌లేదు! ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి.. అంద‌రి కంటే ఎంతో ప్రాధాన్య‌మిచ్చారు! ఎంత‌మంది వ్య‌తిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అంద‌ల మెక్కించారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న స‌ల‌హాలు విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ నీళ్ల‌పాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహ‌క‌ర్త‌ పీకే దెబ్బ‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా త‌గిలింది. ఈ […]

షాక్‌: 40 మంది ఎమ్మెల్యేలు జంప్‌

స‌మస్య‌కు ప‌రిష్కారం దొరికిన చోటే మ‌రో కొత్త స‌మ‌స్య ప్రారంభ‌మ‌వుతుంది. దీనికి సరైన ఉదాహ‌ర‌ణే త‌మిళ‌నాడు పాలిటిక్స్‌! చైన్నై థ్రిల్ల‌ర్ సినిమాకు అప్పుడే క్లైమాక్స్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు. సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న కుర్చీలాట‌లో.. ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో మ‌లుపులు! ఎవ‌రు ఎవ‌రివైపు ఉంటారో.. ఎవ‌రు వ్య‌తిరేక వ‌ర్గంవైపు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి! అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన ఈ సంక్షోభం.. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈపీఎస్‌-ఓపీఎస్ వ‌ర్గాల విలీనంతో ఒక స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వ‌గా.. ఆ […]

ల‌గ‌డ‌పాటి జోస్యం నిజ‌మైంది.. కాకినాడ కూడా సైకిల్‌దేన‌ట‌! 

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా గుర్తింపు పొందిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.. నంద్యాల ఉప పోరుపై చెప్పిన జోస్యం అక్ష‌రాలా నిజ‌మైంది. అత్యంత ట‌ఫ్‌గా సాగిన ఈ ఉప ఎన్నిక‌పై అందరూ ఏవేవో.. క‌థ‌నాలు , జోస్యాలు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి కూడా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇక్క‌డ ఎంత ట‌ఫ్ పోరు సాగినా..భారీ సంఖ్య‌లో జ‌నాలు క్యూక‌ట్టి ఓట్లేసినా.. కూడా వార్ వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని, టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. […]

ఓట‌మికి కార‌ణాలు చెప్పేసిన శిల్పా

నంద్యాల‌లో టీడీపీ జోరు ముందు వైసీపీ ప‌రువు కూడా ద‌క్కించుకులేని ప‌రిస్థితికి దిగ‌జారింది. ఘోర ఓట‌మి ఖ‌రారు కావాడంతో వైసీపీ అభ్య‌ర్థి ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసిన వెంట‌నే నిరాశ‌తో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న ఓట‌మి అంగీక‌రించారు. టీడీపీ భారీ స్థాయిలో డ‌బ్బులు పంచ‌డంతో పాటు సెంటిమెంట్ బ‌లంగా ప‌నిచేయ‌డం వ‌ల్లే తాను ఓడిపోయిన‌ట్టు ఆయ‌న చెప్పారు. టీడీపీ ఓటుకు రూ. 2 […]