ఐపీఎల్ మ్యాచ్లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్..

ఇటీవల టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన మూవీ కృష్ణమ్మ. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ఏర్పడింది. ఇక ఈ సినిమా మే 10న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేశారు మేకర్స్.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. అయితే ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సత్యదేవ చిన్న చిన్న పాత్రలో కెరీర్‌ ప్రారంభించి హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏ కథకైనా, ఏ పాత్రకైనా ఆయన న్యాయం చేయగలడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.

Director Anil Ravipudi Fun Speech @ Krishnamma Movie Pre Release Event |  Filmyfocus.com - YouTube

ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌లు రెండు రోజులు చూడకపోతే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్, సెకండ్ షో సినిమాలను చూడడానికి ప్రేక్షకులంతా థియేటర్స్ కు రండి. క్రికెట్ స్కోర్ ను మీ ఫోన్లో అయినా చూడవచ్చు అంటూ అనిల్ రావిపూడి కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం అనీల్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.