టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా జ్యూరీ నుంచి అవార్డ్ను అందుకున్న కామాక్షి భాస్కర్ల ఇటీవల ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమేర 2 కి గాను ఆ అవార్డును అందుకుంటున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా కామాక్షి మాట్లాడుతూ పొలిమర 2 లో నా నటనకు ఉత్తమ నటిగా అవార్డు రావడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని.. ఈ అవార్డ్కు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి నా ధన్యవాదాలు అంటూ షేర్ చేసుకుంది. ఈ అవార్డు నట్టిగా నా బాధ్యతను మరింతగా పెంచిందంటూ వివరించింది. ఈ క్రమంలో తనకు నటన నేర్పిన గురువుగారు రత్నశేఖర్, నేజర్ కబీ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ.. నా ప్రయాణంలో మీ అందరి సపోర్ట్ కు ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్న అంటూ వివరించింది.
కామాక్షి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే డాక్టర్గా చదివిన పూర్తి చేసిన కామాక్షి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి.. ఆ ఇమేజ్తోనే సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలను అందుకుంది. ఇటీవల వచ్చిన పొలిమేర సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ.. పలు అవార్డులతో పాటు వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల తెరకెక్కిన శ్రీ విష్ణు మూవీ ఓం భేమ్ బుష్ లోను ఈమె మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.