ఏపీలోమండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి రేస్ లో అదృష్టవంతులెవరో..!

ఏపీలో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఒకే వ‌ర్గానికి చెందుతున్నాయ‌నే విమ‌ర్శ మూట‌గ‌ట్టుకుంటోంది టీడీపీ. త‌మ సామాజిక‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతోంద‌ని కొన్ని వ‌ర్గాలు బాహాటంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మ‌థ‌న‌ప‌డుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి దక్క‌తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా రెడ్డి. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు.. ఈ ప‌దవిపై ఆశ‌పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు […]

అనుష్క వ‌ల్ల బాహుబ‌లికి అన్ని కోట్లు న‌ష్ట‌మా..

బాహుబ‌లి 2 సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. లెక్క‌కు మిక్క‌లిగా స్కైను ట‌చ్ చేసే రేంజ్‌లో ఉన్న అంచ‌నాల‌తో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినీ జ‌నాలు ఎంత‌లా ఎదురు చూస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. ఇదిలా ఉంటే బాహుబ‌లి 2లో అనుష్క క్యారెక్ట‌ర్ వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20 కోట్లు లాస్ వ‌చ్చింద‌ట‌. అసలు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి ది బిగినింగ్ సినిమాలో అనుష్క దేవ‌సేన రోల్‌కు సంబంధించి […]

ఏకులా వ‌చ్చిన మేకులా మారిన కొమ్మినేని

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అత్యుత్సాహం ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మేకుగా మారింది. త‌న‌ను న‌మ్మి కీల‌క‌మైన స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు జ‌గ‌న్‌నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు కొమ్మినేని! అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ..కోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన కౌంట‌ర్ ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జ‌గ‌న్‌కు చెందిన చాన‌ల్‌లో కొమ్మినేని చేసిన ఇంట‌ర్వ్యూ వ‌ల్ల జ‌గ‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను మంచి వ్య‌క్తిగా చూపించాలనే అత్యుత్సాహం.. జ‌గ‌న్‌ను మ‌రోసారి జైలు ఊస‌లు […]

కేసీఆర్ `ముంద‌స్తు` వెనుక అస‌లు కార‌ణ‌మిదే

ముందస్తు ఎన్నిక‌లు.. ఇప్పుడు తెలంగాణ‌లో జోరుగా వినిపిస్తున్న మాట‌. వ్యూహాల్లో ఎవ‌రికీ అందకుండా ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే సీఎం కేసీఆర్‌.. ముందస్తు ఎన్నిక ల‌గురించి ఎందుకు ఆలోచిస్తున్న‌ట్లు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆయ‌న ఎన్నికల గురించి నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర మైన అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌. అందుకే వీలైనంత తొంద‌ర‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించి మ‌ళ్లీ అధికారిన్ని చేజిక్కించుకోవాల‌ని వ్యూహాత్మ‌కంగా ఈ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహానికి తెర‌తీశార‌ట‌. తెలంగాణలో ప్ర‌తిప‌క్షం బ‌ల‌ప‌డుతోంది. […]

బ‌ల‌రాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగ‌మా

కొత్త‌గా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు అధిక‌మ‌వుతున్నాయి. ఈ విష‌యం మొన్న జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా కనిపించింది. క‌ర్నూలు పేరు మ‌రింత‌గా అంద‌రికీ వినిపించినా.. ప్ర‌కాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే త‌ర‌హా కోల్డ్‌వార్ న‌డిచింది. అయితే చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాన్ని స‌మ‌సిపోయేలా చేశారు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌! ఒక వ‌ర్గానికి ఎమ్మెల్సీ సీటు, మ‌రో వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి సీటు […]

బీజేపీ బాహుబ‌లి అత‌డా? ఆమెనా?

ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ సిద్ధ‌మైంది. పార్టీ కొన్ని చోట్ల బ‌లంగా ఉన్నా.. శ్రేణుల‌న్నింటినీ ఏకం చేసి ఎవ‌రు న‌డిపిస్తార‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవ‌రూ కాద‌ని ఒక ఫేమ‌స్ ఫేస్ కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా ఇద్ద‌రి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ‌రిని ప్ర‌ధాని మోదీ, అధ్య‌క్షుడు అమిత్ షా ఎంపిక చేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 2019 ఎన్నిక‌ల నాటికి ఏపీలో […]

సుజ‌నా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు

వ్యాపార‌వేత్తగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగానూ తానేంటో నిరూపించారు సుజ‌నా చౌద‌రి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండ‌దండ‌లందించి.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు. ఎన్నిక‌ల్లో ఏపీలో, ఎన్నిక‌ల త‌ర్వాత ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ త‌న వ్యూహాల‌ను అమ‌లుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప‌వ‌ర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో అధికార ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న‌రావు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండేది. కానీ సుజ‌నా త‌న చ‌తుర‌త‌తో ఆయ‌న్ను లైమ్ లైట్ నుంచి త‌ప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగనే ముందు

దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ […]

2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..

పార్టీని స్థాపించి మూడేళ్ల‌యినా ఇంకా నిర్మాణ కార్య‌క్ర‌మాల‌పై దృష్టిసారించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ముఖ్యంగా యువ‌త‌కు పార్టీలో పెద్ద పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని.. ఇప్పుడు ఆ కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించారు. తాను పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత‌పురం జిల్లా నుంచే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ముఖ్యంగా జ‌నసేన సైనికుల‌కు పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌నలో వెల్ల‌డించారు.  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని […]