బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. లెక్కకు మిక్కలిగా స్కైను టచ్ చేసే రేంజ్లో ఉన్న అంచనాలతో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే బాహుబలి 2లో అనుష్క క్యారెక్టర్ వల్ల నిర్మాతలకు ఏకంగా రూ.20 కోట్లు లాస్ వచ్చిందట.
అసలు మ్యాటర్ ఏంటంటే బాహుబలి ది బిగినింగ్ సినిమాలో అనుష్క దేవసేన రోల్కు సంబంధించి రెండో భాగానికి కూడా చాలా సన్నివేశాలను షూట్ చేశారు. ఇదంతా రెండు సంవత్సరాలనాటి మాట. ఆ తర్వాత అనుష్క సైజ్ జీరో సినిమా కోసం ఏకంగా బాగా లావు పెరిగిపోయింది. ఇప్పుడు అనుష్క బరువు బాగా పెరిగిపోయింది. ఆమెతో ఇప్పుడు మిగిలిన భాగం షూట్ చేయిస్తే మొదటి భాగమప్పుడు చేసిన షూటింగ్కీ, ఇప్పటి షూటింగ్కి తేడా స్పష్టంగా కనిపిస్తోందట! ఇది సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూపుతుందన్న డౌట్తో రాజమౌళి ఫస్ట్ పార్ట్లో అనుష్కపై తీసిన సన్నివేశాలను తిరిగి రీ షూట్ చేయించాడట.
ఇందుకోసం అదనంగా రూ.20 కోట్లు ఖర్చయ్యాయట. అయినా చిత్ర నిర్మాతలు మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా అనుష్క సన్నివేశాలను రూ.20 కోట్లు పెట్టి మరీ రీ షూట్ చేయించారట.