తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]
Tag: TRS
టార్గెట్ కేసీఆర్: కోదండరామ్ వదల్లేదు
కేసీఆర్ని టార్గెట్ చేయడం ఇప్పట్లో మానేలా లేరు తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. విదేశాలకు వెళ్ళి వచ్చిన కోదండరామ్ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్పై విమర్శలకే వాడుకోవడం ద్వారా ‘టార్గెట్ కేసీఆర్’ మిషన్ని యాక్టివ్గానే ఉన్నట్లు సంకేతాలు పంపారాయన. తెలంగాణ ఉద్యమంలో కెసియార్తో కలిసి పనిచేసిన కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కెసియార్ ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే తనను దాటేసి వెళ్ళిపోతున్నారని […]
ఈ వ్యభిచారమేటి రెడ్డిగారూ?
పార్టీ ఫిరాయింపుని రాజకీయ వ్యభిచారం అని సంబోదిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే అదిప్పుడు రాజకీయాల్లో సాధారణ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన పక్కన పెట్టి మరీ పాలకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో జరిగినప్పటికీ రాజకీయ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత జుగుప్సాకరంగా ఇంతకు ముందెన్నడూ పార్టీ ఫిరాయింపులు జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించినవారిలో గుత్తా సుఖేందర్రెడ్డి ఒకరు. ఆయన కూడా […]
హైకోర్టులో గెలిచిన కెసిఆర్
ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ఆయనపై వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా చంద్రశేఖరరావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు […]
KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్, ఆ బాధ్యతని కెటియార్ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్, హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్లో రోడ్లు నరకానికి […]
KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్
బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో […]
కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్ జమానా!!
తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్ని టిఆర్ఎస్లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్, టిఆర్ఎస్లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]
తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్సింగ్ రాష్ట్ర పర్యటన […]
మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!
ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు. తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No […]