ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా ? అన్న ప్రశ్నకు ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వినిపిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ, ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చల ప్రకారం కామినేని మంత్రి పదవికి ఊస్టింగ్ తప్పదన్న చర్చలు బలంగా నడుస్తున్నాయి. కామినేని శ్రీనివాస్ను ముందునుంచి ఏపీ బీజేపీ వాళ్లంతా చంద్రబాబు కోవర్ట్గా అనుమానిస్తుంటారు. గతంలో టీడీపీతో అనుబంధం ఉన్న కామినేని శ్రీనివాసరావు ఆ తర్వాత ప్రజారాజ్యం […]
Tag: bjp
జట్టుకట్టనున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?
ఏపీ రాజకీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? నిన్నటి వరకు తిట్టిపోసిన వాళ్లనే అక్కున చేర్చుకుని ఆదరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయా? ఇప్పటి వరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రులకు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు ఆర్ణబ్ గోస్వామి!! రెండు పార్టీలకు ఉన్న ప్రధాన లక్ష్యాలే ఇకపై ఏపీని శాసించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]
బాబుకి బీజేపీ మంత్రి క్రీం బిస్కెట్! మోడీ కన్నా తోపని కామెంట్!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన […]
కాకినాడలో టీడీపీ దెబ్బతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతోందా..
చంద్రబాబు పార్టీ టీడీపీ.. తాజాగా తన మిత్రపక్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు పెద్ద పీట వేస్తుందని, మిత్రం పక్షం కాబట్టి టీడీపీ తమను నెత్తిన పెట్టుకుంటుందని భావించిన బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దాదాపు ఏడేళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక్కడి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో […]
బీజేపీని వదిలించుకునే యత్నాల్లో బాబు
నంద్యాల ప్రచారం చివరి దశకు చేరుకున్నా.. ఇప్పటికీ మిత్రపక్షమైన బీజేపీ ప్రచారంలో కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వీటికి తెరదించాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న నేతల్లో మరోసారి విభేదాలు వచ్చేలా చేస్తోంది. వైసీపీతో జత కట్టేందుకు బీజేపీ నేతలు సుముకత వ్యక్తంచేస్తున్న తరుణంలో.. టీడీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. ఏదో మతలబు ఉందని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీని వదిలించుకునే భాగంలో.. […]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. తన మార్క్ ఖాయం!
నెల్లూరుకు చెందిన సీనియర్ రాజకీయ దురంధరుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్కి రెండో పౌరుడిగా, ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వెంకయ్య గురించి ప్రధానంగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.. ఆయన రాజకీయ అజాత శత్రువు! అంతేకాదు, అన్ని పార్టీల నేతలకూ ఆయన ఆప్తుడు!! ఆద్యంతం అంత్య ప్రాసలతో సాగే ఆయన ప్రసంగ ప్రవాహాన్ని విని ఆస్వాదించని, ఆనందించని నేతలు తెలుగునాట లేరంటే అతిశయోక్తే! మాతృభాష కాని హిందీలోనూ అనితరసాధ్యమైన మాటల తూగు.. పదాల […]
కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్..!
కేంద్రంలో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్రధాని నరేంద్ర మోడీలు 2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా సరికొత్తగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర పక్షాల బలాబలాలను అంచనా వేయడంతోపాటు.. కొత్తవారిని చేర్చుకుని బలోపేతం అయ్యేందుకు ఆ రకంగా మళ్లీ హస్తినలో సీటును కైవసం చేసుకునేందుకు మోడీ, షా ధ్వయం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమకు మిత్రులుగా ఎన్డీయేలో ఉన్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా? లేదా? అన్నది […]
రాం మాధవ్ విషయంలో బీజేపీ యూటర్న్!
బీజేపీ సీనియర్ నేత, ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని పూర్తిగా ఒంటబట్టించుకున్న తెలుగు వాడు రాం మాధవ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఖాయమని భావించిన నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. విషయంలోకి వెళ్తే.. ఏపీలో బీజేపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మంత్రి, సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయారు. దీంతో ఏపీ నుంచి కేంద్రంలో చక్రం తిప్పిన వెంకయ్య పోస్టులోకి కొత్త వారిని […]
జీఎస్టీ దెబ్బకు తెలంగాణ విలవిల
జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రశంసించారు. ఇప్పుడు లోక్సభలో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్ను వివరించారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతోందని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]