శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. అయినప్పటికీ […]
Category: Politics
నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్ – తలసాని శ్రీనివాస్యాదవ్కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్యాదవ్గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]
సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అట
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడట..అవును మీరు నమ్మినా నమ్మక పోయినా..ఇది నిజం.ట్విట్టర్ లో స్పందించడం..6 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేయడం అలవాటుగా చేసుకున్న పవర్ స్టార్ రూట్ మార్చబోతున్నారట..నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేస్తారేమో చూడాల్సిందే. మొన్న తిరుపతి సభ చూసారు కదా.పవన్ మాటల ధాటి..ఎవరి పైన అని మాత్రం అడక్కండి..అది ఆయనకే క్లారిటీ లేదు..ఎప్పటిలాగే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని ఆ […]
మళ్ళీ ముంచేసిన జానారెడ్డి.
మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్ఎస్ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు ఇంకోసారి షాక్కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, […]
కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ
తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]
ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]
యాక్షన్లోకి దిగుతున్న ఉండవల్లి
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లీగల్ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్కుమార్ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్ లేకపోయినా, లాజిక్ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]
పవన్తో పోటీ ఎందుకు రోజా!
పవన్ ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. వస్తానంటున్నాడంతే. అలాంటి పవన్కళ్యాణ్ని రాజకీయంగా విమర్శిస్తే రోజాకి ఒనగూరే లాభమేంటట? రాజకీయాల్లో చిరంజీవి అంటే రోజాకి అస్సలు పడదు. టిడిపిలో ఉండగానే కాదు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా రోజా, ఇంకా గట్టిగా చిరంజీవిని విమర్శిస్తూ వచ్చారు. చిరంజీవితోపాటు పవన్కళ్యాణ్ని కూడా విమర్శించడం ఆమెకు అలవాటు. టిడిపి గెలిచిందే పవన్కళ్యాణ్ దయతో అని చెబుతూనే పవన్కళ్యాణ్ని రబ్బర్సింగ్ అని తీసిపారెయ్యడం రోజాకే చెల్లింది. రబ్బర్సింగో, గబ్బర్సింగో రోజాకే బాగా […]
టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్మెంట్కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]