తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీలన్ని కూడా అక్కడ ప్రతిపక్షాలుగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్రతిపక్ష నేతలు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని టీడీపీ ఫైర్బ్రాండ్ రేవంత్రెడ్డి విసిరే పంచ్లకు ఉండే క్రేజే వేరు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు […]
Category: Politics
ముద్రగడను ఫాలో అవుతోన్న కోదండరాం
ఉద్యమానికి పాఠాలు నేర్పిన ప్రొఫెసర్.. కోదండరాం! అలాంటి వ్యక్తి ఇప్పుడు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఫాలో అవుతున్నాడట. కొంత విచిత్రంగా అనిపించినా, వినిపించినా నిజం అంటున్నారు పరిశీలకులు! విషయంలోకి వెళ్లిపోతే.. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఒక పంట పండే భూములను మాత్రమే సేకరించేందుకు చట్టం అనుమతిస్తోంది. అయితే, దీనివల్ల మల్లన్నసాగర్ వంటి వాటికి కొన్ని అడ్డంకులు తలెత్తాయి. దీంతో భూసేకరణ కష్టాలను మొత్తంగా […]
కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజుకు దిమ్మ తిరిగిందా
టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్గజపతి రాజుకి దిమ్మతిరిగిపోయింది! తాను చేసిన కామెంట్కి కౌంటర్ ఘాటుగా ఉండే సరికి మైండ్ బ్లాంక్ కూడా అయిందట రాజుగారికి!! తానేదో మంత్రి హోదాలో ఓ కామెంట్ విసిరితే.. తనపై అంతే రివర్స్లో ఇంత ఘాటు కౌంటర్ రువ్వాలా? అని రాజుగారు ఇప్పుడు తెగ ఇదైపోతున్నారట. ఎప్పుడూ ఎంతో గంభీరంగా.. తాను ఎవరినీ లెక్కచేయను అనేధోరణిలో వ్యవహరించే మంత్రి రాజుగారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఉదంతం ఏంటో తెలిస్తే.. మీరు […]
జయ మృతిపై అనుమానాలు – అసలు నిజాలు..!
దివంగత తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేతల అమ్మ.. పురుట్చితలైవి జయలలిత మృతి చెందిన మూడు వారాల తర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టమ్ చేయనున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయనే వార్తలు నిజమేనా? ఆమెపై విష ప్రయోగం జరిగిందనే కామెంట్లకు ఇప్పుడు బలం చేకూరుతోందా? జయది సాధారణ మరణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల జనాల్నిసైతం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జయ ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]
సొంత పార్టీ ఎమ్మెల్యేకే కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
టీఆర్ ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాస్ గౌడ్కు సాక్షాత్తూ.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు సంబంధంలేని విషయంలో కలుగ జేసుకని ఏపీ, తెలంగాణల మధ్య వివాదం వచ్చేలా చేస్తున్నారని శ్రీనివాస్పై కేటీఆర్ ఆగ్రహించారట. మరి ఈ విషయంలోకి వెళ్లిపోతే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అనుమతులపై ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు […]
బలిజలు కొత్త ఉద్యమం.. ముద్రగడకు రాం రాం!
బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగిన కాపు ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా? ఆధిపత్య పోరుకు కాపు ఉద్యమం పరాకాష్టగా మారుతోందా? ముద్రగడ నాయకత్వంపై తిరుగుబాటు వస్తోందా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కాపులను వేర్వేరు పేర్లతో పిలుస్తుండడం తెలిసిందే. ఇలాంటిదే బలిజ కూడా! ఇది కూడా కాపు వర్గమే. అయితే, కోస్తాలో కన్నావీరి సంఖ్య సీమ జిల్లాల్లో అత్యధికం. అయితే, ప్రభుత్వంపై పోరు చేయడంలో మాత్రం కాపులతోనే కలిసి […]
2019 ఎన్నికలపై బాబు-జగన్ల పగటికలలు!
ఏపీలో ఎలక్షన్స్కి కనీసం ఎంతలేదన్నా మరో రెండేళ్ల సమయం ఉంది. అయినా కూడా అటు అధికార, ఇటు ఏకైక విపక్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నికలు వచ్చేసినట్టు.. తామే అధికారంలోకి వచ్చేసే ఛాన్స్ ఉన్నట్టు పెద్ద ఎత్తున కలరింగ్ ఇస్తున్నాయి. దీంతో మామూలు జనానికి పిచ్చి పడుతోంది. విషయం ఏంటంటే.. 2014 ఎన్నికలు పూర్తయి ఖచ్చితంగా రెండున్నరేళ్లు. మరో ఐదేళ్లకు అంటే 2019 ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు, […]
టీడీపీ నేతల ఫైటింగ్కు కారణం
ఏపీ అధికార పార్టీ నేతల్లో అవినీతి ఏ రేంజ్కి చేరుకుందో చెప్పడానికి గుంటూరు ఘటన ఉదాహరణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ల మధ్య వివాదం మీడియా సాక్షిగా రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి కథనంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఒప్పందంలో భాగంగా పృథ్వీలతకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అయితే, అలా అప్పగించబోనని జానీ మూన్ భీష్మించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో పృథ్వీలత తరఫున […]