పాన్ ఇండియన్ మూవీ కుబేర తరువాత నాగార్జున నెక్స్ట్ మూవీపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ దర్శకుడు నవీన్ తో నాగ్ ఓ సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఓ ప్రధాన పాత్రలో పోషించనున్నారని తెలుస్తోంది. ఇటీవల రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించి ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం నాగార్జునను ఢీకొట్టే ప్రతి నాయకుడిగా.. శక్తివంతమైన పాత్రలో బాబి డియల్ కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్ జూన్ నెలలో ప్రారంభించనున్నారని టాక్. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. అయితే ఇంకా వారెవరో అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఇక నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర సినిమాలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మిక కథానాయకగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక మే రెండున ఈ సినిమా నుంచి ఓ అద్భుతమైన అప్డేట్ బయటకు రానుందని సినిమా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఓ భారీ పిడుగు సీజ్ చేసి లోడ్ చేయడం జరిగిందంటూ.. నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది.