భ‌లే విచిత్రం.. ప్ర‌తిప‌క్ష‌నేత‌కు మంత్రి బ‌హిరంగ‌లేఖ‌

ఎక్క‌డైనా స‌రే అధికార పార్టీకి, మంత్రుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు లేఖ‌లు రాయ‌డం, విజ్ఞ‌ప్తులు చేయ‌డం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం మంత్రినే ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ లేఖ రాసింది ఎవ‌రంటే తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, మ‌రి ఎవ‌రికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. […]

ఆ తేదీవ‌ర‌కూ క‌రోనా తీవ్రత.. విశాఖ శార‌దాపీఠం

కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్న‌ది. మ‌హ‌మ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాల‌ను కోల్పోతుండ‌గా, ల‌క్ష‌లాదిమంది గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా విశాఖ శార‌దా పీఠాధిప‌తులు శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి మ‌హాస్వామి క‌రోనా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న […]

బ్రేకింగ్ : కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!

ఏపీలో ఘోరం జరిగింది. ముగ్గురాయి గనిలో పేలుడు వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కడపజిల్లాలోని కలసపాడు మండలంలో చోటుచేసుకుంది. ముగ్గురాయి గనిలో కార్మికులు ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు వల్ల కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. జిలిటెన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురాయి గనిలో పనుల కోసం […]

కోవిడ్ ను ఎదుర్కోనేంద‌కు కేంద్రం కొత్త కార్యక్రమం

దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వ‌నున్నారు. ఆ రెండు మందులు సమర్థ‌వంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]

త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగి తొలిసారి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కమల్‌ను త‌మిళులు ఊహించ‌ని దెబ్బ కొట్టారు. క‌మ‌ల్‌తో స‌హా పార్టీ అభ్య‌ర్థులు త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]

ఈట‌ల భూక‌బ్జాలో కొత్త ట్విస్ట్‌.. హైకోర్టుకు రైతులు!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉదంతంలో వెలుగులోకి వ‌చ్చి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌ గ్రామ భూముల వివాదంలోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూముల స‌ర్వేను అడ్డుకోవాల‌ని వారు డిమాండ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జాతో వెలుగులోకి వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వం దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌పై దృష్టి సారించింది. న‌లుగురు ఐఏఎస్‌ల‌తో ప్ర‌త్యేక […]

బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ గడువు పొడిగింపు..!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు తెలంగాణ సర్కార్ పొడిగించింది. రేపు ఉదయం వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలోనే తిరిగి దాన్ని పొడగించారు. వారం పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ముందుగా 15రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించింది. అనంతరం మే ఒకటిన రెండవసారీ […]

విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని, మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని […]

వ్యాక్సిన్ ఇవ్వ‌లేద‌ని ఏఎన్ఎంపై దాడి..!

కొవిడ్ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతున్న‌ది. ఆక్సిజ‌న్ అంద‌క వంద‌లా మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనా బాధితుల‌కు ఏడాది వైద్యాధికారులు అవిశ్రాంతంగా సేవ‌ల‌ను అందిస్తున్నారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మూర్ఖులు వైద్య‌సిబ్బందిపై దాడుల‌కు దిగుతున్నారు. ఇటీవ‌ల మాస్క్‌ల‌ను పెట్టుకోవాల‌ని సూచించిన ఓ న‌ర్స్‌పై, శానిటేష‌న్ సిబ్బందిపై ఇద్ద‌రు యువ‌కులు దాడుల‌కు దిగారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రొక వెలుగుచూసింది. ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరి […]