ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ గా సంపాదించేశారట! ఇక్కడ రాష్ట్రంలోనూ, అక్కడ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది తామే కదా అనుకున్నారో ఏమో.. తాము ఏం చేసినా అడిగేదెవరు అని భావించారో ఏమో.. అడ్డగోలుగా అందినకాడికి దోచేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెండు చేతలా సంపాదించేశారు. అందినకాడికి అన్ని పనుల్లోనూ కమీషన్లు కొట్టేశారు. బెదిరించి, దందాలు చేసి మరీ బ్లాక్ మనీకి పోగేసుకున్నారు. అయితే, వీరంతా ఒక్కసారిగా ప్రధాని […]
Category: Latest News
గాలి వారింట పెళ్లి కూతురి చీర, నగల ఖరీదు తెలిస్తే…!
గనుల మహరాజ్.. గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న ఈ పెళ్లిపైనే దేశం మొత్తం దృష్టి పెట్టింది. వాస్తవానికి నోట్ల రద్దు విషయం పెద్ద టాపిక్ కాకపోయి ఉంటే గాలి వారింట పెళ్లికి మించిన పెద్ద టాపిక్ ఇంకోటి ఉండేది కాదు!! ఆకాశ మంత పెళ్లిపందరి, భూదేవంత పెళ్లి పీట అనే మాటలు ఇప్పటి వరకు మనం కేవలం విన్నాం. కానీ, గాలి […]
కేసీఆర్ బ్లాక్ మనీతో జీతాలు ఇచ్చారా..!
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లాక్ మనీ నిరోధానికి తాము వ్యతిరేకం కాదని, అయితే, ఈ క్రమంలో మోడీ తీసుకున్న నిర్ణయమే తమ ఆదాయాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని కేసీఆర్ విమర్శించారు. లెక్కలతో సహా ఆయన పక్కాగా విమర్శించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, రియల్ దెబ్బతినడం వంటి కారణాలతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని, దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ […]
చంద్రబాబుది రావణాసురుడి అన్నయ్య పాలనా?!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఏపీ సీఎం చంద్రబాబుపై వెరైటీగా విరుచుకుపడ్డారు. ఏపీలో భయపడుతూ బతకాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన రావులపాలెం – అంతర్వేది ముద్రగడ కాపు సత్యాగ్రహ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంది. ముద్రగడపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయని పోలీసులు ఆయన పాదయాత్రలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంటూ ముద్రగడను మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్దే నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులకు, ముద్రగడకు […]
కేంద్రంపై టీఆర్ఎస్ ప్రెజర్ ఎందుకు..!
రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు కాక తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తాకుతోంది. ఇప్పటికే ఈ నోట్ల రద్దుతో స్టేట్లో వ్యాపారాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో దాని ద్వారా భారీ ఎత్తున వచ్చిపడే రెవెన్యూ నిలిచిపోయిందని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పెత్త ఎత్తున వాపోయారు. అదేకాకుండా బంగారం, వెండి, దుస్తుల కొనుగోళ్లు వంటివి పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, హైదరాబాద్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉండి కూడా కొనుగోళ్లు […]
ఏపీ బాసరకు సూపర్ హంగులు..ఎక్కడో తెలుసా..!
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం వల్ల ఉన్నత చదువులు చదివి జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. దీంతో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. దీంతో ఈ ఆలయం దేశ వ్యాప్తంగా ఫేమస్! ఇక, ఇప్పుడు ఇదే తరహాలో ఏపీలోనూ కోటప్పకొండ దక్షిణామూర్తి […]
తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు అనుకూలమా..!
ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వార్కు కారణమైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయారని టీఆర్ఎస్ ప్రభుత్వం నానా రచ్చ రచ్చ చేసేసింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్రబాబును నువ్వు దొంగ అని ఓపెన్గానే అనేశారు. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే పెద్ద మచ్చగా మిగిలింది. అప్పట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్గా […]
ఆ మంత్రితో వేగలేం అంటోన్న టీడీపీ కార్యకర్తలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి, దళిత నేత రావెల కిశోర్ బాబుకి సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోందా? ఆయన పట్ల స్థానిక టీడీపీ నేతల్లో సానుభూతి తగ్గుతోందా? మంత్రి పట్ల స్ఠానిక టీడీపీ తమ్ముళ్లే ఆగ్రహంతో ఉన్నారా? 2019లో ఈ పరిణామం ప్రభావం చూపనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెరమీదకి వచ్చిన రావెల.. ఎవ్వరూ ఊహించని విధంగా చంద్రబాబు దగ్గర మార్కులు […]
కోనసీమలో టెన్షన్…. హైటెన్షన్
తూర్పుగోదావరి జిల్లాలో పచ్చదనం పరవళ్లు తొక్కే.. కోనసీమలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఠక్ ఠక్ ఠక్ మనే పోలీసు బూటు చప్పుళ్లు హోరెత్తిస్తున్నాయ్! ప్రశాంత సీమలో ఎవరిని పలకలరించినా టెన్షన్.. ఏ కూడలిలో చూసినా హై టెన్షన్!! కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి(బుధవారం) చేపట్టనున్న సత్యాగ్ర హ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కోనసీమ ప్రాంతంలో మోహరించారు. అమలాపురం, రావులపాలెం, మందపల్లి తదితర ప్రధాన ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు […]