చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్‌ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్‌ చెయ్యనున్నారని సమాచారమ్‌. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్‌ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]

ఉద్యోగుల మెడపై కత్తి!!

ఎంత మంది ఎన్ని వినతులు, వేడుకోలులు చేసినా ప్రభుత్వోద్యోగుల విషయం లో చంద్రబాబు కనీసం కనికరం కుడా లేకుండా తరలి రావాస్లిందే అన్నట్టు హుకుం జారి చేసారు.దీనికి తోడు స్థానికత అంశాన్ని మెలిక పెట్టి ఉద్యోగులపై తనదైన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ఇంకేముంది అడిగే దిక్కులేక,చేసేదేమీ లేక కొత్త రాజధాని అమరావతికి తరలేందుకు ఉద్యోగుల్లో సందడి మొదలైంది. తరలింపు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారాల్లో విజయవాడకు వెళ్ళి అద్దె ఇళ్ళ కోసం […]

చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం – చంద్రోపదేసం

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు సెక్రటేరియట్ ను పరిశీలించిన సీఎం ఏపీ ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అమరావతికి రావాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి వస్తాయని […]

ఉద్యోగుల తరలింపు పై చంద్రబాబు వెనకడుగు.

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులు, భవన నిర్మాణ స్థితిగతులపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్న సీఎం, ఇప్పుడు పట్టువిడుపుల ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, ఇంటీరియర్ డెకరేషన్ సహా పూర్తి కావాలంటే […]

ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాలు..

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర శాతం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తే మన రాష్ట్రం ఎందులోనూ తీసిపోనట్లే స్పష్టమవుతోరది. ప్రధానంగా […]

విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]

ముద్రగడ దీక్ష..సెకండ్ రిలీజ్!!

ఆరునెలల క్రితం వరకు ఆయనెవరో ఎవరికీ పెద్దగా తెలీదు.అంతలోనే కాపులను వుద్దరించేస్తానని కాపు జాతికి తానే బ్రాండ్ ఐకాన్ అని సెల్ఫ్ డబ్బా కొట్టేసి ఎడా పెడా వివాదాలు రేపుతూ వార్తల్లో నిలుస్తు హల్చల్ చేసేస్తున్నాడు. ఖాళి సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకున్నంత వీజీగా ఈయన దీక్షలపై దీక్షలు చేస్తున్నారు.అంతేనా పోలిసోల్లు కనబడితే చాలు నన్ను అరెస్ట్ చెయ్యండి మొర్రో అని మొత్తుకుంటున్నాడు.అరెస్ట్ లన్నా పోలిసులన్నా ఆయనకి మహా సరదా. సినిమాల్లో బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు మళ్లీ […]

రెచ్చిపోతున్న అధికార నేతలు

రాష్ట్రంలో ‘అధికార’ రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, దాదాగిరీతో విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌, దౌర్జన్యాలు, బెదిరింపులు హెచ్చరికలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపైనా దాడులకు దిగుతున్నారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ఐని, అడ్డుకున్న కానిస్టేబుళ్లను చితకబాదారు. విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ హోంగార్డును తీవ్రంగా కొట్టాడు. నూజివీడు ప్రాంతంలో సెటిల్‌మెంట్‌ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వృద్ధుడి మరణానికి కారణమయ్యారు. ఇక భూకబ్జాలు, ఇళ్లపైకి వెళ్లి అడ్డుకున్న వారికి కొట్టడాలు […]

డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]