పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు. […]

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు […]

కారు కావాలా.. కియా కార్నివాల్ ఉందిగా..

పార్టీ అధినేతలకు, ప్రభుత్వ పెద్దలకు కోపం, ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలియదు.. అర్థం కాదు.. కోపం వచ్చిన వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది.. ప్రేమ చూపిన మరుక్షణమే కోపంగా మారిపోతారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం కష్టం. సరే అనడం తప్ప ఏమీ చేయరాదు. ఇంతకీ అసలు విషయమేమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కియా కార్ కార్నివాల్ అంటే ఎందుకో ప్రేమ ఎక్కువైన్నట్లుంది. కారు అంటేనే కియా కార్నివాల్.. ఇక ప్రపంచంలో అంతకుమించి కార్లున్నాయా.. దానిని కాక దేనిని […]

సారుకు సడన్ గా రోడ్లెందుకు గుర్తుకొచ్చాయో?

కాస్త ఆలస్యమైనా ఏపీ సీఎం జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని.. ఒక్క గుంత కూడా రోడ్డుపై కనిపించరాదని అధికారులను ఆదేశించారు. 46వేల కిలోమీటర్ల రోడ్లను జూన్ 2022లోపు మరమ్మతులు చేయాలని, రోడ్లన్నీ క్లీన్ గా కనిపించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు నాటికి 8268 కిలోమీటర్ల రోడ్లకు రిపేరు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కూడా ఆదేశించారు. పల్లె, పట్టణం, మునిసిపాలిటి, కార్పొరేషన్, రాష్ట్ర.. […]

పోటీచేద్దామా? వద్దా? ఏం చేద్దామంటారు?

కాంగ్రెస్ పార్టీ.. వందేళ్ల ఘన చరిత్రగల అతి పెద్ద రాజకీయ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న పార్టీ..అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ.. ఇవీ కాంగ్రెస్ పార్టీ గురించి క్లుప్తంగా చెప్పదగ్గవి.. ఈ విషయాలన్నీ ఇపుడు ఎందుకంటే.. ఇంత ఘన చరిత్రగల పార్టీ ఇపుడు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]

ఐఏఎస్ వద్దు..రాజకీయాలే ముద్దు?

పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. వివిధ హోదాల్లో ప్రజాసేవ.. గ్రూప్ 1 అధికారిగా ఎంపిక.. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీఓగా విధి నిర్వహణ, 2007లో ఐఏఎస్ హోదా.. డ్వామా పీడీ, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం, ఆ తరువాత కన్ఫర్మ్డ ఐఏఎస్ గా పదోన్నతి.. జేసీగా పనిచేసిన వ్యక్తి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ గా ప్రజాసేవ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఆయనే వెంకట్రామరెడ్డి.. ఇందులో ఏముంది.. అంత […]

బాస్ మదిలో ఏముందో? ఎమ్మెల్సీ బెర్త్ ఎవరికిస్తాడో?

టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల దాఖలుకు ఈరోజే (మంగళవారం) చివరి రోజు కావడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో బీపీ పెరిగిపోతోంది. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపిక కాని వారికి సమాధానం ఏం చెప్పాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచీ ఇదే విషయంపై కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఆఖరి రోజు వరకు ఎంపిక చేయకపోవడంతో నాయకులు టెన్షన్ తో అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో […]

సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!

కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ […]