టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రాలలో ఆది పురుష్ కూడ ఒకటీ.ఈ చిత్రం జూన్ 16వ తేదీన విడుదల కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా ప్రస్తుతం చిత్ర బృందంతో పాటు ప్రభాస్ కూడా చాలా బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత మంచి హైప్ కలిగిన చిత్రంగా సలార్ సినిమా ఉందని చెప్పవచ్చు. ప్రభాస్ లాంచ్ కి మాస్ కటౌట్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దొరికితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోగలం.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా రికార్డులన్నీ అతి తక్కువ సమయంలోనే సాధిస్తుందని చెప్పవచ్చు. ఈ కాంబినేషన్ కి ఉన్న పవర్ అలాంటిది అభిమానులు భావిస్తున్నారు రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశం ప్రభాస్ కెరియర్ లోని బెస్ట్ గా ఉండబోతోందని సమాచారం.. ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాన్ని బీట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు ఎందుకంటే ఆయన చిత్రాలలోని ఇంటర్వెల్ సన్నివేశాలు ఒకదాని మించి మరొకటి ఉంటాయని గత సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది.
ప్రభాస్ కెరియర్ లోనే మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలోని ది బెస్ట్ సన్నివేశాలని చెప్పవచ్చు.. కేవలం ఈ సినిమా కోసం రూ .35 కోట్ల రూపాయలు ఇంటర్వెల్ సన్నివేశానికి ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపుగా ఇప్పటికే 80% ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని వచ్చే ఏడాది సెప్టెంబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని తెలుస్తోంది ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.