ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ హీరోల హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్లో ఏ విధంగా అయితే టాలీవుడ్ హీరోలను ఆదరిస్తున్నారో అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. మాలీవుడ్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు టాలీవుడ్ లో డబ్ అయ్యి కోట్లల్లో వసూళ్ళు రాబడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మంజుమాల్ బాయ్స్, ప్రేమమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. కంటెంట్ బావుంటే కటౌట్ తో సంబంధం లేదని మరోసారి ఈ సినిమాలు నిరూపించాయి.
తాజాగా మలయాల నటుల టాలెంట్ ని చూసి డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి నటులు ఉన్నారని.. చెప్పడానికి నాకు అసూయగా ఉంది అంటూ నేను యాక్షన్ సన్ని వేశాలతో సాధించే చప్పట్లు.. మలయాళనట్లు చిన్న ఎక్స్ప్రెషన్స్ తో సొంతం చేసుకుంటున్నారని అందుకు వాళ్లను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంటూ.. ఇలా ప్రశంసలు అందుకోవడం అంత ఈజీ కాదు.. ఎంతో శ్రమిస్తే కానీ రాదు అంటూ కామెంట్స్ చేశాడు. వాళ్ళ సక్సెస్ బట్టి వారి శ్రమ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని.. అక్కడ దర్శకులు ప్రతి పాత్రని ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దుతున్నారంటూ.. అందుకే ఇది సాధ్యమవుతుందని వివరించారు.
మా కార్తికేయ.. ప్రేమలు అనే సినిమా డిస్టిబూటర్గా మారినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలను కోరుకుంటున్న అంటూ ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటివరకు జక్కన తెరకెక్కించిన ఏ సినిమాలోను మలయాళ నటులు లేరు. ఇతర భాషల నుంచి హీరోయిన్లు వచ్చారు కానీ మలయాళం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరు రాలేదు. మరి ఎస్ఎస్ఎంబి 29 లో అక్కడ ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడో.. లేదో.. చూడాలి. ఇలానే తెలుగు నటులతోనే తెరను నింపేసే రాజమౌళి.. హీరోయిన్లను మాత్రం ఇతర భాషల నుంచి తీసుకువస్తారు. ఈయన సినిమాల్లో చాలా రేర్ గా ఇతర ఇండస్ట్రీలో నటులు కనిపిస్తారు.