గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో కూడా రష్మిక పాకిస్థన్ యువతిగానే కనిపించింది.
మిషన్ మజ్ను చిత్రంలో రష్మిక ఒక అంధురాలి పాత్రలో కనిపించింది. సీతారామంలో అలాగే పాకిస్తానీ అమ్మాయి అవ్వడం వల్ల మిషన్ మజ్ను కూడా మంచి పేరు మరియు హిట్ అవుతుందని రష్మిక భావించింది. కానీ ఆ సెంటిమెంట్ మాత్రం ఇక్కడ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఇక దివంగత ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఇండో పాక్ దానికి ముందు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. శత్రుదేశం యొక్క అను రహస్యాలను తెలుసుకునేందుకు గాను ఇండియన్ గూడచారి అయిన హీరో పాకిస్తాన్ లోకి చోరపడడం జరుగుతుంది.
ఆ తర్వాతే జరిగిన పరిణామాలు ఏంటన్న విషయమే ఈ చిత్రం కథ. పాకిస్తానీ అమ్మాయిగా రష్మిక ఇందులో కనిపిస్తుంది కదా మరియు స్క్రీన్ ప్లేయర్ లోపాలు ఉండడంతో పాటు రష్మిక పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేకపోవడంతో మిషన్ మజ్ను సినిమా కూడా ఈమెకు నిరాశ కలిగించింది. ప్రస్తుతం రష్మిక ఆశలన్నీ పుష్ప -2 సినిమా పైన మాత్రమే ఉన్నది.