తెలంగాణ టీడీపీలో మోత్కుప‌ల్లి ఒంట‌రా?!

తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా న‌ల్లగొండ జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఇప్పుడు ఒంట‌రి వాడైపోయార‌ట‌. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయార‌ట‌. నిజానికి ఒక‌ప్పుడు అన్న‌గారి హ‌యాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చ‌క్రం తిప్పిన మోత్కుప‌ల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. తాజాగా తెలంగాణ‌లో గురువారం మ‌హానాడు జ‌రిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్త‌ల్లో లేని మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తెర‌మీదికి […]

చంద్ర‌బాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..

రాష్ట్రంలో రోజుకు 18 గంట‌లు క‌ష్ట ప‌డుతూ.. తాను ప‌డుకోకుండా.. అధికారుల‌ను కూడా ప‌డుకోనివ్వ‌కుండా ఆరు ప‌దుల వ‌యసు దాటి మ‌న‌వ‌డిని, కుటుంబాన్ని సైతం వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం క‌ష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత అధికారం చేప‌ట్టిన బాబు.. తీవ్ర క‌ష్ట న‌ష్టాలు స‌హా రాజ‌ధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించేందుకు ఎన్నో […]

షా కామెంట్ల‌తో మోడీకి కేసీఆర్ ఝ‌ల‌క్‌!!

పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత‌! అచ్చు ఇప్పుడు ఈ సామెత‌నే ఒంట బ‌ట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన బీజేపీ సార‌ధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయ‌న పాల‌న‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ల‌క్ష కోట్ల‌కు పైగా ఇచ్చామ‌ని, అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా ఎక్క‌డా రాష్ట్రంలో అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. నిజానికి తెలంగాణ‌పై ఎవ‌రు ఏ […]

మ‌హానాడు ఎఫెక్ట్‌.. రేవంత్ రేటింగ్ పెరిగింది!

పొలిటిక‌ల్‌గా కొంత ఫైర్ బ్రాండ్‌గా ఉండే తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంటారాఫ్‌ది టాపిక్‌గా మారిపోయాడు. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో టీడీపీ మహానాడు జ‌రిగింది. దీనికి పెద్ద ఎత్తున టీడీపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. దీనికి టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కూడా హాజ‌రై దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న కొన్ని ప‌రిణాలు ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారాయి. ఈ కార్య‌క్ర‌మానికి మొత్తం రేవంత్ అన్నీ తానై […]

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]

చంద్ర‌బాబు గ్రాఫ్ త‌గ్గుతోందా…

ఏపీలో అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఒకే వ‌ర‌లో ఇమ‌డ‌ని క‌త్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షంగా క‌నిపిస్తున్నా రెండు పార్టీల నాయ‌కులు మాత్రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామ‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నారు. బీజేపీకి ఎవ‌రితోను పొత్తులు అక్క‌ర్లేద‌ని..ఏపీకి బీజేపీ ముఖ్య‌మంత్రే కావాల‌ని బీజేపీలో కొంద‌రు నాయ‌కులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు. ఇక టీడీపీ నాయ‌కులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి […]

టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్‌

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయాలు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జ‌న‌సేన మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌కు తెర‌లేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మ‌ధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వ‌న్‌సైడ్‌గానే ఉంటుంద‌ని అంద‌రూ […]

క‌డ‌ప‌లో జ‌గ‌న్ గ్రాఫ్ ఎందుకు త‌గ్గుతోంది….రీజ‌న్స్ ఇవే.

క‌డ‌ప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బ‌ల‌మైన ఖిల్లా. క‌డ‌ప జిల్లా నుంచే ప్రారంభ‌మైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజ‌కీయాల‌తో పాటు స‌మైక్యాంధ్ర రాజ‌కీయాలు, చివ‌రిగా ఢిల్లీ రాజ‌కీయాల‌ను సైతం (అప్ప‌ట్లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఢిల్లీలోను హ‌వా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ త‌ర్వాత వైసీపీ పూర్తి ఆధిప‌త్యం సాధించాయి. ఈ మూడు ఎన్నిక‌ల్లోను జిల్లాలోని క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్క‌సారి […]

ఓటుకు నోటు కేసు భ‌యం బాబుని ఇంకా వెంటాడుతోందా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయ‌న త‌న‌ను తాను అలెగ్జాండ‌ర్‌తో పోల్చుకుంటారు. తానెవ‌రికీ భ‌య‌ప‌డ‌డ‌ని, అవినీతికి త‌న ద‌గ్గ‌ర తావు లేద‌ని ప‌దే ప‌దే చెబుతుంటారు. అయితే, నిన్న బుధ‌వారం జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మాత్రం బాబు పిరికి వాడ‌నే కామెంట్లు రావ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. అదేంటో మీరూ చ‌ద‌వండి! ప్ర‌స్తుతం టీడీపీలో మ‌హానాడు ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మ‌హానాడు పెద్ద ఎత్తున జ‌ర‌గ‌నుంది. […]