ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి

తెలంగాణలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్ షా.. తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న చేయ‌డం, భారీ బ‌హిరంగ స‌భ పెట్ట‌డం, కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌డం, కేంద్రం ల‌క్ష కోట్ల‌కు పైగానే తెలంగాణ‌కు సాయం చేసింద‌ని చెప్ప‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ధ్యేయంగా బీజేపీ నేత‌లు ముందుకు సాగుతుండ‌డం వంటి విష‌యాల నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ […]

వైసీపీ అనుకూల వ‌ర్గానికి టీడీపీ గాలం!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోతోందా? వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాల‌ని డిసైడ్ అయ్యాయా? అదే స‌మ‌యంలో అధికార టీడీపీ పంచ‌న చేరాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ద‌ళిత వ‌ర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌తి పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఇక‌, వైసీపీకి ఈ విష‌యంలో క‌లిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

ఇద్ద‌రు చంద్రుల ఏక‌ప‌క్ష‌ ధోర‌ణులు.. అల్లాడుతున్న నేత‌లు, అధికారులు

ఏపీ, తెలంగాణ సీఎంల ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేత‌లు అల్లాడి ఆకులు మేస్తున్నార‌ట‌! థ‌ర్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ ఉద్య‌మ సార‌ధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి ర‌గులుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణ‌లో కేసీఆర్ హ‌వాతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]

టీడీపీలో బాబు మాట‌కు విలువ లేదా…

ప్ర‌పంచంలో రాజ‌కీయ పార్టీల‌లో నాయ‌కుల మ‌ధ్య విబేధాలు స‌హ‌జం. అధికార పార్టీలో ఇవి మ‌రింత ఎక్కువుగా ఉంటాయి. ఆధిప‌త్యం అనే ఒకే ఒక్క అంశం నాయ‌కుల మ‌ధ్య విబేధాల‌ను తారాస్థాయికి చేర్చుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే తెలుగుజాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేసి, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మిగిలిన పార్టీల‌తో పోల్చ‌లేం. 36 ఏళ్ల ప్ర‌యాణంలో నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు పాల‌న వ‌ర‌కు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. అయితే ఈ […]

టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌… టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

తెలంగాణ‌లో ఉనికిని చాటుకునేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డుతోన్న టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. తెలంగాణ‌లోని పాత ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ ఈ నెల 29న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా ప‌నిచేయ‌గా, ఆయ‌న భార్య సుమ‌న్ రాథోడ్ ఖ‌నాపూర్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగాను, ఆయ‌న త‌న‌యుడు రితీష్ […]

టీడీపీతో బీజేపీ క‌టీఫ్ త‌ప్ప‌దా?! 

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేత‌లు 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ర‌థ‌సార‌థి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు షా స‌భ‌లో, బ‌య‌టా కూడా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వ‌దిలేద్దాం అని షాకు చెప్ప‌క‌నే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన […]

తెలంగాణ టీడీపీలో మోత్కుప‌ల్లి ఒంట‌రా?!

తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా న‌ల్లగొండ జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఇప్పుడు ఒంట‌రి వాడైపోయార‌ట‌. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయార‌ట‌. నిజానికి ఒక‌ప్పుడు అన్న‌గారి హ‌యాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చ‌క్రం తిప్పిన మోత్కుప‌ల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. తాజాగా తెలంగాణ‌లో గురువారం మ‌హానాడు జ‌రిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్త‌ల్లో లేని మోత్కుప‌ల్లి మ‌ళ్లీ తెర‌మీదికి […]