కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]
Category: Latest News
ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క
రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే […]
బాహుబలి-2 అప్పుడే 87 కోట్లు వచ్చేశాయి!
రజిని కబాలి డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డల్ అయినట్టు తెలుస్తోంది.రిలీజ్ కి ముందు బాహుబలి రికార్డ్స్ ని కబాలి క్రాస్ చేస్తుందని అంతా ఊదరగొట్టేసారు.అయితే సినిమా రిలీజ్ అయ్యాక చతికిలబడింది.కలెక్షన్స్ ఇప్పటికీ బానే వున్నా అవి బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసే రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తోంది. కబాలి తో కంగుతిన్న డిస్టిబ్యూటర్స్ చూపు బాహుబలి -2 పడినట్టు తెలుస్తోంది.బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన కలెక్షన్స్ సునామి ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా […]
సల్మాన్ఖాన్కి మళ్ళీ విముక్తి
అదేంటో అన్నీ సల్మాన్ఖాన్కి అలా కలిసొచ్చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన పాపాలన్నీ కెరీర్లో సక్సెస్ల కారణంగా మరుగునపడిపోతున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ సుడి అలా తిరుగుతోంది. ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసు నుంచి ఊరట పొందిన సల్మాన్ఖాన్ ఇంకో కేసఉలో ఊరట పొందాడు. సల్మాన్ఖాన్ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది రాజస్థాన్ హైకోర్టు. 18 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇది. ఆ సమయంలో కొందరు బాలీవుడ్ నటీ నటులతో కలిసి కృష్ణ జింకల్ని వేటాడిన సల్మాన్ఖాన్, […]
ఈయనే బాబా రాందేవ్ బెక్ హామ్..
ఎప్పుడూ రోటీన్ యోగానేనా.. కాస్తంత డిఫెరెంట్గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామనుకున్నారు… ఏమో యోగా గురు బాబా రాందేవ్. ఒక్కసారిగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ ఫుట్బాల్ స్టేడియంలో ట్రేడ్ మార్క్ దుస్తులైన కాషాయం దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చారు.. అయితే యోగా చేసేందుకు కాదు.. ఫుట్బాల్ ఆడేందుకు..పార్లమెంటేరియన్లకు బాలీవుడ్ స్టార్లకు మధ్య జరిగిన ఛారిటీ ఫుట్బాల్ మ్యాచ్ లో ఇలా మెరిశారు బాబా రాందేవ్. బాలీవుడ్ స్టార్లకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించారు. అభిషేక్ జట్టులో రణ్బీర్ […]
ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?
ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]
కార్నర్ అయ్యింది హరీష్రావే
మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్రావు కార్నర్ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్ఎస్ నాయకులంతా హరీష్రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ […]
చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్
ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]
కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు
మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]