పూరి భార్య లావ‌ణ్య చిరంజీవి తో షాకింగ్ రిలేషన్ .. ఈ వ‌ర‌స మీకు తెలుసా..!

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ విచిత్రమైన డైరెక్టర్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన పూరి రెండు దశాబ్దాల చరిత్రలో ఎన్నో సార్లు కింద పడ్డారు.. ఎన్నోసార్లు పైకి లేచారు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలోనే ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ చూడటానికి వచ్చిన లావణ్యను తొలిచూపులోనే ప్రేమించాడు పూరి.

యాంకర్ ఝాన్సీ – హేమతో పాటు అప్పుడు తన స్నేహితులు సాయం చేయడంతో లావణ్యను చాలా సింపుల్ గా ఓ గుడిలో పూరి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా పూరి భార్య లావణ్య ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలతో పాటు ఆ హీరోల ఫ్యామిలీల‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. రవితేజ జగన్ తో ఎంతో సన్నిహితంగా ఉంటాడని.. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కింద కూర్చుని… కింద పడుకుని అక్కడే తినేస్తాడు అని లావణ్య చెప్పింది.

ఇక బ‌న్నీ గాడు అయితే తాను ఎప్పుడు ఫోన్ చేసినా అక్క అక్క అని ఎంతో ఆప్యాయతతో ఉంటాడని… మోహన్ బాబు ఫ్యామిలీతో తనకు ఎంతో అనుబంధం ఉందని… మోహన్ బాబు భార్య నిర్మలమ్మ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తి అని… అలాగే బన్నీ తల్లి నిర్మల‌మ్మని తాను అమ్మ అని పిలిచు కుంటానని లావణ్య తెలిపారు. ఇక మహేష్ బాబు ఇంటికి తమ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్ లకు వెళుతుందని… మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖను తాను అక్క అని పిలుచుకుంటా అని.. చిరంజీవి తన ఫేవరెట్ హీరో కావడంతో పాటు తాను బావ అని పిలుచుకుంటా అని లావణ్య చెప్పారు. అది చిరు – లావ‌ణ్య బావ‌, మ‌ర‌ద‌ల్ల బంధం..!