ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువు.. ఇప్పుడు ఈ మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు రవితేజ. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ` అనే మరో సినిమాను పట్టాలెక్కించాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీలో దివ్యాన్ష కౌశిక్, రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే మరోవైపు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో `ధమాకా` సినిమాను షురూ చేసేశాడు మన మాస్ మహారాజ. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. అందులో `పెళ్లి సందD` ఫేమ్ శ్రీలీలా ఒకరు కాగా.. మరొక హీరోయిన్ కోసం దర్శకుడు వేటలో ఉన్నాడని తెలుస్తోంది.
కథ డిమాండ్ మేరకు తీసుకుంటున్నారా..? లేక కలిసొస్తుందని తీసుకుంటున్నారా..? అన్నది పక్కన పెడితే.. ఈ మధ్య రావితేజ చేస్తున్న అన్ని ప్రాజెక్స్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్ అయిపోయింది. దీంతో ఇప్పుడీ విషయమే నెట్టింట హాట్ టాపిక్గా కూడా మారింది. కాగా, ధమాకా తర్వాత రతివేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను చేయనున్నాడు.