గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దీన్నిబట్టి చరణ్ గేమ్ ఛేంజర్పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బుక్ మై షో లో అత్యధికంగా తెలంగాణకు సంబంధించిన థియేటర్స్ ఉండగా.. 70% తెలంగాణ బుకింగ్ ఉంటే.. అందులో ఆంధ్రప్రదేశ్లో 30% బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి. కాగా అడ్వాన్స్ బుకింగ్స్లో.. కేవలం ఏపీలోనే బెనిఫిట్షో బుకింగ్స్ ప్రారంభించారు.
ఇక బుకింగ్స్ ఓపెన్ అయిన గంటకే గేమ్ ఛేంజర్ సంచలనం సృష్టిస్తుంది. గంటకి 15 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోతున్నాయి. తెలంగాణ సోషల్ లేకున్నా ఈ రేంజ్ లో బుకింగ్స్ అంటే అది సాధరణ విషయం కాదు. ఏపీలో ప్రాంతాల వారిగా బెనిఫిట్స్ నుంచి సినిమాకు.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే నాలుగు సెంటర్ బుకింగ్స్ తో బెనిఫిట్ షోలకు మాత్రమే రూ.2కోట్ల గ్రాస్ సాధించగా.. ఇక నెల్లూరు జిల్లాలో రూ.50 లక్షలు, కృష్ణాజిల్లాలో రూ.22అక్షలు, కర్ణాటకలో కోటి రూపాయలు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈస్ట్ గోదావరి జిల్లాలో సాధారణ అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నిదానంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ మాత్రం బుకింగ్స్ ఓపెన్ ఆయన కొద్దిసేపటికి రూ.60 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. అలా అన్ని ప్రాంతాలవారీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రూ.5కోట్ల గ్రాస్ వసూళ్ళు రావడం విశేషం. రేపు ఉదయం నుంచి పూర్తిస్థాయి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాలి. ఇక ఇప్పటికే ట్రేడ్లో సినిమాపై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు వింటేజ్ శంకర్ సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఆరెంజ్ లో సినిమా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ ఊచకోత మొదలవుతుంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ హిట్ గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు.