తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇటీవలే RRR సినిమా పాటలకు గాను పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు కీరవాణి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ సైతం కీరవాణిని ప్రశంసించడం జరిగింది. ఇక ఈతరహాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరీల నాటు నాటు సాంగ్ అనే పాటకు ఆస్కార్ ఫైనల్ లో నామినేషన్ లిస్టులో చోటు సంపాదించుకోవడం జరిగింది.
తెలుగు సినిమా ఖ్యాతిని భారతీయ చలన చిత్ర రంగం యొక్క స్థాయిని ప్రపంచ స్థాయికి పాకేలా చేసిన కీరవాణి కి ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలు గురించి ప్రముఖుల సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి చిన్న జీయర్ స్వామీజీ కి పద్మభూషణ్ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. మొత్తం 25 మందికి కేంద్ర అవార్డులను ప్రకటించినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో విద్య సాహిత్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు ఈ పద్మశ్రీ అవార్డులు లభించనున్నాయి. ఇక ఈ జాబితాలో నుంచి తెలుగు రాష్ట్రాలలో నుండి నలుగురు చోటు దక్కడం. విశేషం. మరి రాబోయే రోజుల్లో కీరవాణి మరిన్ని సినిమాలలో నటించి అద్భుతమైన పాటలను అందించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. RRR చిత్రంలో బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు అందుతుందని అందరూ ఊహించగా కానీ అది మాత్రం జరగలేదు.