ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు వివాదంపై పలు విధాలుగా పలువురు ప్రముఖుల సైతం స్పందిస్తూ ఉన్నారు. నందమూరి కుటుంబంతో పాటు కొంతమంది పార్టీ నేతలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ట్విట్ పలు వివాదాలకు దారితీసిందని చెప్పవచ్చు తాజాగా ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ స్పందించడం జరిగింది వాటి గురించి చూద్దాం.
పేరు మార్పుపై ఎన్టీఆర్ స్పందించిన విధానం అటు కోపంగా లేదు ఇది వ్యతిరేకంగా లేదని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చలకు దారితీస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఇలాంటివి చేయడంతో టిడిపి పార్టీలో లోకేష్ కు ప్రాధాన్యత పెరుగుతుందని కొంతమంది కావాలని ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండేందుకే ఇలా ట్విట్ చేశారని అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి నేత అమిత్ షా ను కలవడం జరిగింది. కానీ ప్రత్యేకంగా రాజకీయాలకు ప్రచారాలకు దూరంగా ఉంటానని అమితాబ్ షాపు చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి.
అయితే ఈ విషయంపై జర్నలిస్ట్ భరద్వాజ్ స్పందిస్తూ..ఒకప్పుడు నందమూరి కుటుంబం టిడిపి ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిందనే విషయం నిజమే కానీ దాని ప్రకారంగా ఇలా చేస్తున్నారని వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఇది వారి కుటుంబ సమస్యగా భావించి ఆయన వేరే విధంగా స్పందించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయంగా తెలియజేశారు. సినీ సెలబ్రిటీ లో హోదాలో ఉన్న వ్యక్తి కనుక ఏం చేసినా అది ఆలోచించే చేయాలి వ్యక్తిగతంగా ఏదైనా చేసి ఉంటే బాగుండేదని.. ఎందుచేత అంటే తన తాత గారి పేరుతో ఈ స్థానంలో ఉన్నారు కనుక వేరే విధంగా ట్విట్ చేసి ఉంటే బాగుండు అని తన అభిప్రాయంగా తెలిపారు.