ఆ సీక్రేట్ చెప్పను..చెప్పలేను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..!!

ప్రభాస్..ఆరు అడుగుల అందగాడు అంత ఈజీగా ఏ విషయాని బయటపెట్టడు. గత కొన్ని సంవత్సరాల నుండి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగి అడిగి కోట్లాది మంది ప్రజలు అలసిపోయారు. ఫైనల్ గా మొన్నటి ప్రెస్ మీట్ లో లైవ్ ఫెయిల్యూర్ అంటూ చెప్పి పెళ్లి మ్యాటర్ నుండి తప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్స్ నే చేసి మిడియా వాళ్లకు షాక్ ఇచ్చాడు.

పూజా హెగ్డే-ప్రభాస్ జంటగా నటిస్తున్న చిత్రం “రాధేశ్యామ్‌”. రాధ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో నే సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా గడిపేస్తున్నారు. ఇక మీడియా వాళ్లు కూడా ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు అడుగుదామా అని రాసిన పెట్టుకున్న ప్రశ్నలు అన్నీ అడిగేస్తున్నారు. దీని ప్రభాస్ కూడా తెలివితేటలతో ఆన్సర్ ఇస్తూ తప్పించుకుంటున్నాడు.

శుక్రవారం చెన్నైలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే పలు ప్రశ్నలకు జవాబిస్తూన్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి ప్రభాస్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

రిపోర్టర్: “రాధేశ్యామ్‌” సినిమా విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరాటం అని చాలా సార్లు చెప్పారు కదా.. అయితే ఈ పోరాటంలో చివరకు విధి గెలుస్తుందా.. ప్రేమ గెలుస్తుందా..? అని ప్రభాస్‌ను ప్రశ్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉన్నావారు సైలెంట్ అయిపోయారు. ప్రభాస్ నోటి నుండి ఎలాంటి సమాధానం వస్తుందా అని వెయిట్ చేశారు.

ప్రభాస్: దానికి ప్రభాస్ దానికోసమే దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. మీరు అడిగిన ప్రశ్నలోనే అసలు సినిమా మెయిన్‌ పాయింట్‌ అంతా దాగి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇస్తే నిర్మాతలు ఊరుకోరు. మీకు ఆ ఆన్సర్ తెలియాలంటే సినిమా చూడండి.. ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు.