ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా దిగి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది హనుమాన్. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వసుళను కల్లగట్టి రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పటివరకు ఈ ఏడాదిలో రిలీజైన అన్ని సినిమాల రికార్డులను బీట్ చేసి ఏడది హిట్ సినిమాల లిస్ట్లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సిక్కుల్ గా జై హనుమాన్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో మరో సినిమాను తెరకెక్కించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే మొదట సినిమా టాలీవుడ్ హీరోతో తెరకెక్కించి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా బాలీవుడ్ హీరోను ఎంచుకుంటూ సినిమా తీయడానికి గల కారణం ఏంటో తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఆ సినిమాలో క్యారెక్టర్ రణ్వీర్ కోసమే రాసుకున్నా.. అందువల్లే ఆయనతో చేస్తున్నా అంటూ వివరించాడు ప్రశాంత్ వర్మ. ఇక మొత్తానికి ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసుకోనున్నాడు. ఇక జై హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లు రాపడుతుందని అంచనాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఈ శ్రీరామ నవమి కానుకగా సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచేసాడు ఈ యంగ్ డైరెక్టర్.