వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!

ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌ప‌క్క టీడీలోనే కొన‌సాగుతూ.. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష నేత‌ల‌తో `ట‌చ్‌`లో ఉంటూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముంద‌కు వెళుతున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల కిషోర్‌బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌బీకేసిన విష‌యం తెలిసిందే! ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయి. వీటిని ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]

రోజాపై టీడీపీ అభ్య‌ర్థిగా రాజు గారేనా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై నిరంత‌రం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే రోజా! న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెపై.. 2019 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి కోసం సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డారు. గ‌తంలో ఆమెపై పోటీచేసిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు పోటీ నుంచి విర‌మించుకోవ‌డంతో ఇప్పుడు కొత్త అభ్య‌ర్థి ఎవ‌రా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రి నుంచి పోటీచేయడానికి `రాజు`గారు […]

బాబు స‌ర్కారుకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు..?

ఏపీలో విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన వైసీపీ నేత జ‌గ‌న్‌.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక జ‌రిగిన త‌ర్వాత నుంచి జ‌గ‌న్ కంఠం మూగ‌పోయింది. ఏపీలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, వారు ప్ర‌స్తుతం వివిధ స‌మస్య‌ల్లో చిక్కుకుపోయార‌ని కూడా ఆయ‌న గుర్తించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా గ‌డిచిన వారంలో రాష్ట్రం రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. తూర్పుగోదావ‌రి జిల్లా చాప‌రాయిలో మ‌ర‌ణాలు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల బ‌హిష్క‌ర‌ణ‌. ఈ రెండు సంఘ‌ట‌న‌లు పెద్ద ఎత్తున […]

రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా […]

ఆ రెండు విష‌యాల‌తోనే బాబు ఫైట్‌!!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోంద‌ట‌. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌! దీనికి కార‌ణం.. ఓ రెండు విష‌యాల‌ని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఎంచుకున్నారు. ఎక్క‌డ ఏ స‌భ‌లో మాట్లాడినా ఆరెండు విష‌యాలు చెప్ప‌కుండా ఆయ‌న ఉండ‌లేక‌పోతున్నారు. దీంతో ఆ రెండు విష‌యాలే ఇప్పుడు ఆయ‌న‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయ‌ట‌. ఇంత‌కీ […]

క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దెబ్బేశాడుగా! 

త‌న‌కు క‌మ్యూనిస్టులంటే గౌర‌వం ఉంద‌ని, వాళ్ల భావ‌జాలం.. త‌న భావ‌జాలంలో సారూప్య‌త ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకైనా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వ‌స్తున్నాడు. దీంతో క‌మ్యూనిస్టులు కూడా ప‌వ‌న్ త‌మ‌తో దోస్తీక‌డ‌తాడ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. అయితే వారికి ప‌వ‌న్‌.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని, ఇందుకు ప‌వ‌న్ కూడా తోడ‌యితే త‌మ‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని భావించిన క‌మ్యూనిస్టుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. […]

నారా బ్రాహ్మ‌ణిపై వైసీపీ అభ్య‌ర్థి ఖ‌రారే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు, హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌య్య బాబు కుమార్తె బ్రాహ్మ‌ణి రాజ‌కీయ ప్ర‌వేశంపై ఇప్ప‌టికే కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్క‌డి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మ‌ణిని లోక్ స‌భ కు పంపాల‌ని బాబు గ‌త కొన్నాళ్ల కింద‌టే డిసైడ‌య్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుంద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]

ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు 2019లో సారి

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ సారి టిక్కెట్ల విష‌యంలో కాస్త క‌టువుగానే వ్య‌హ‌రిస్తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి వ‌రుస‌గా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వ‌గా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]