సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు..!

గ‌త ఏడాది క‌రోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్ర‌భుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంద‌ని, ఎవ‌రికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాల‌ని చెప్తున్నారు. తాజాగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయన తన సోష‌ల్ మీడియా […]

నిర్మాతగా మారనున్న యంగ్ హీరో!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు అయిన హీరో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. టాలీవుడ్కే ఇండస్ట్రీలో కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం2 వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ ఇప్పుడు నిర్మాత గా మారి రాణించాలనుకుంటున్నాడు. కాగా వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టి మూవీస్ నిర్మించబోతున్నాడు సుమంత్ అశ్విన్. గతంలో నిర్మాతగా పలు హిట్​లు తన ఖాతాలో వేసుకున్న నిర్మాత ఎమ్మెస్​ రాజు. […]

వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ఈ […]

అఖండ సినిమాకి బాల‌య్య రెయ్యునరేష‌న్ ఏంటంటే..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్. చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో […]

కరోనా నుండి కోలుకున్న ప్రముఖ డైరెక్టర్..!?

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయగా, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోలు ఈ మహమ్మారి నుండి రక్షణ కోసం తమ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. అలాగే టాలీవుడ్ […]

ఓటీటీలో కార్తీ సినిమా..!?

  ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ […]

వైరల్ అవుతున్న స‌మంత బ‌ర్త్ డే వేడుక‌..!

అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ స‌మంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి ప‌దేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 స‌మంత బ‌ర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోష‌ల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయ‌గా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు. […]

ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

యాంకర్ శ్యామల భర్త పై కేసు..!

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా ఆమె దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా ఆ మహిళ తెలిపింది. […]