యాంకర్ శ్యామల భర్త పై కేసు..!

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా ఆమె దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా ఆ మహిళ తెలిపింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు కూడా నర్సింహారెడ్డి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. కాగా సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా ఆమె చెప్పింది. ఈ ఇష్యూ పై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు శ్యామల భర్త నర్సింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించగా అందరిలో ఆసక్తి నెలకొంది.