కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?

ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.

అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్. ప్రజలు ఒకే చోట చేరకుండా చుస్కోల్వలని,వివాహాలకు కేవలం 50 మంది మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. ఇంకా స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.