భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం `ఇదీ ఆ సదస్సు ముందు మంత్రులు చెప్పిన మాట! `భాగస్వామ్య సదస్సులో రూ.10.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి` ఇదీ ప్రభుత్వ లెక్క! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి! ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ లెక్కల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉందట. హోదా కోసం యువత విశాఖ ఆర్కే బీచ్లో ఉద్యమించిన తర్వాతి […]
Category: Politics
ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట
అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జరగనుంది. అనుభవజ్ఞుడిగా పేరున్న చంద్రబాబుకు.. నవ్యాంధ్రను పునాదుల నిర్మించే అవకాశాన్ని ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దీనికి తోడు జనసేనాధిపతి పవన్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయగలగడంతో ఎవరికి […]
హోదాను ప్రజలకు చేరనివ్వని మీడియా
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామగ్రామాన స్ఫూర్తి ని రగిలించడంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచాయి! అలాగే తమిళులు జల్లికట్టుపై తెలిపిన నిరసనను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాలని పోరాడుతున్న ఏపీ ప్రజలకు మాత్రం మీడియా సపోర్ట్ ఉండటం లేదా? భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొందరు […]
బాబు-కేసీఆర్లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్ది టాక్గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్భవన్లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]
బాబును ఏకేసిన అమరావతి కాంట్రాక్టు సంస్థ
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి నిర్మాణం ఇప్పుడు ఆయన పరువును ఢిల్లీ వీధుల్లోకి చేర్చింది! తమతో ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు తొండి చేస్తున్నారని అమరావతి కాంట్రాక్టు సంస్థ మాకీ అసోసియేషన్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి పలు ఆంగ్ల పత్రికల్లో నిన్న పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. విషయంలోకి వెళ్తే.. అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు పెద్ద ఎత్తున కలలుకంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన […]
బీజేపీ లెక్క: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్
ఏపీకి ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరో మలుపు తిరిగిందా? నిజానికి హోదా విషయంలో ఏపీకి అర్హత లేదా? విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీకి అర్హత లేదుకాబట్టే.. ఇంతకాలం హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందా? అందుకే ఇప్పటి వరకు హోదా బదులు ప్యాకేజీతో సరిపెడతామని అంటోందా? అంటే.. ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా సోము హోదాపై స్పందించారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా.. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? అని […]
జగన్ కట్టడికి బాబు వ్యూహం ఇదేనా?!
పొలిటికల్గా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే టీడీపీ, వైకాపాల మధ్య ఇప్పుడు హోదా రూపంలో మరింత అగ్గి రాజుకుంది! ప్రత్యేక హోదా కోసం జగన్ నేతృత్వంలో మొన్న తలపెట్టిన శాంతి యుత ప్రదర్శనకు బాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మొగ్గలోనే తొక్కేసిన విషయం కొన్ని మీడియా ఛానళ్లు దాచి పెట్టినా.. సోషల్ మీడియా ఎవరి కొమ్మూ కాయదు కాబట్టి.. దీని ద్వారా అందరికీ అర్ధమైపోయింది. సో.. నిన్న మొన్నటి వరకు ఓ మాదిరిగా ఉన్న జగన్ రేటింగ్ ఇప్పుడు […]
బావపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసింది లేదు! కానీ తొలిసారి హరికృష్ణ.. చంద్రబాబుపై నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్నతర్వాత ఎన్టీఆర్ రాజకీయ […]
ఏపీకి హ్యాండ్ ఇచ్చిన ఈరోస్
లక్షల కోట్లలో ఎంవోయూలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఖాయం. ఇక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి! అంటూ ఒక పక్క ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది!! ఇప్పటికి రెండు సార్లు ఏపీలో పారిశ్రామిక సదస్సు జరిగింది. దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంటున్నాయి. మరి ఇవి అమలవుతున్నాయా? ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పర్యాటక శాఖలోని వ్యవహారం […]