వెంకయ్య బొంకు రామాయణం..

బీజేపీ లో వెంకయ్య నాయుడి రేంజే వేరు.పార్టీకి ఏసమస్యవచ్చినా వెంకయ్యే దారిచూపుతుంటారు.వెంకయ్య వాక్చాతుర్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.అయన మైక్ పట్టుకుంటే ఎక్కడ మొదలెడుతారో ఎక్కడ ముగిస్తారో ఆయనకే తెలీదు.అలా తడుముకోకుండా అనర్గళంగా ఉపన్యాసాలు దంచేస్తారు ఈ నాయుడు గారు.అలాంటి ఈయన మన తెలుగోడు అవడం అందులోనా రాష్ట్రం విడిపోయి కష్టకాలం లో ఉన్న మనందరికీ వారమనుకున్నారు అందరు. అందులోనా ఈ నాయుడు గోరు అధికార బీజేపీ పార్టీ వాడు, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం లో […]

టీడీపీ:తెలుగు వారి దౌర్భాగ్యాపు పార్టీ

రాజ్యసభలో కేవీపీ ప్రయివేట్ మెంబెర్ బిల్ చర్చ వాడి వేడిగా జరిగింది.అయితే సిగ్గు పడాల్సిన విషయమేంటంటే దేశం మొత్తం పార్టీలకతీతంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యక హోదా కోసం నిందిస్తుంటే అధికార టీడీపీ మాత్రం అత్యంత జుగుప్సయాకరమైన రీతిలో బీజేపీ ని వెనకేసుకు రావడం చూస్తే నిజంగా తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టి తగలబెట్టేశారు. ఎంతసేపు కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది..ఇదంతా కాంగ్రెస్ వల్లనే..మొత్తం కాంగ్రెస్ చేసింది అని పాడిన పాటే పాడి..బీజేపీ హామీ ఇచ్చింది..కచ్చితంగా అమలు […]

వేడుకలు సీమకి అభివృద్ధి అమరావతికి!

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా తయారైంది రాయలసీమ అభివృద్ధి వ్యవహారం.ఒకప్పటి రాయలు పాలించిన రతనాల సీమ నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురై అంతకంతకు వెనుకబడిపోతోంది.రాయలసీమ అంటే కేవలం ముఖ్య మంత్రుల్ని సప్లై చేసే ఫ్యాక్టరీ గానే చూస్తున్న తరుణం లో దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి గారు అది నిజం కాదని నిరూపిస్తూ రాయసీమను కరువు కోరల్లోంచి రక్షించేందుకు అనేక తాగు,సాగు నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు.ఒక్క ప్రాజెక్టులే కాదు విద్య,వైద్య,పారిశ్రామిక […]

లండ‌న్ కోర్టు, సింగ‌పూరోడు:చంద్ర మాయ

ఏపీ రాజ‌ధాని నిర్మాణ వ్యవ‌హారాన్ని స్విస్ చాలెంజ్ ప‌ద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగ‌పూర్ క‌న్సార్టియానికి క‌ట్టబెట్టింది. అదే సంద‌ర్బంలో న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందుల‌న్నీ లండ‌న్ కోర్టులో తేల్చుకోవాల‌ని ఒప్పందం చేసుకుంది. అంటే భ‌విష్యత్తుల్లో సింగ‌పూర్ క‌న్సార్టియం లాభాల‌కు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒక‌వేళ ప‌రిస్థితులు తార‌మార‌యితే మాత్రం లండ‌న్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మ‌నంద‌రి ప‌రిస్థితి దోషులుగా నిల‌వాల్సి ఉంటుంది. సింగ‌పూర్ కంపెనీల లాభాల కోసం మ‌న రాజ‌ధాని క‌డుతున్న చందంగా ప‌రిస్థితులు మార్చేసిన […]

పవన్ బెంజ్ కార్ అందుకే అమ్మేశాడా!

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించిన వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన తన బెంజ్‌ కార్ అమ్మేశారని చెప్పుకుంటున్నారు. తన దగ్గర ఉండే మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్‌ను పవన్ అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారు మోడల్‌ను ఎప్పుడో నిలిపివేసింది బెంజ్ కంపెనీ. అప్పట్లో రూ.1.5 నుంచి రూ.2 కోట్లు ధర ఉన్న ఈ కారు ఇప్పుడు అమ్మితే రూ.80లక్షలు కూడా రాకపోవచ్చని వినికిడి. కాకపోతే పవన్ వాడారు కాబట్టి రూ.1 కోటి వరకు చేతికంది ఉండొచ్చు. అసలు […]

నెపోలియన్ అఫీషియల్ కాదా?

చిరంజీవి సినిమాకు టైటిల్‌ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. టైటిల్‌ విషయంలో సినిమా యూనిట్‌ మాత్రమే కాకుండా అభిమానుల అభిప్రాయాలకి కూడా అవకాశమిచ్చింది చిత్ర యూనిట్‌. దాంతో అభిమానులు తమ అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయడానికి సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతోంది. అందుకే చిరంజీవి కొత్త సినిమా కోసం అభిమానులు ఓ టైటిల్‌ ఫిక్స్‌ చేసి, దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. అదే ‘నెపోలియన్‌’. సినిమా టైటిల్‌ అయితే అదిరిపోయింది. కానీ […]

రివ్యూ రాయుళ్ళపై రజిని డాటర్ లైవ్ యాక్షన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ సూపర్ బజ్ సృష్టించింది. అయితే.. అంచనాలు అందుకోలేకపోయింది. రికార్డ్‌ లెవల్ వసూళ్లైతే వచ్చాయి గానీ మూవీపై నెగిటివ్ టాక్ వెళ్లాల్సినంత దూరం వెళ్లిపోయింది. అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. కానీ.. రివ్యూల విషయంలో రజినీ కుమార్తె సౌందర్య రియాక్టవుతున్న తీరుకు చాలామంది విస్తుపోతున్నారు. థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు సాధారణం. అయితే.. […]

కమల్ ను ఏడ్పిస్తున్న కామెడీ మూవీ

లోకనాయకుడు కమల్ హాసన్, ఆయన కూతురు శృతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా తెరకెక్కాల్సిన కామెడీ- అడ్వెంచరస్ చిత్రం ‘శభాష్ నాయుడు’. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కమల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కమల్ తాను నటించిన దశావతారం చిత్రంలోని బలరాం నాయుడు పాత్రనే ఈ సినిమాలో పోషించనున్నారు. అయితే ఈ ‘శభాష్ నాయుడు’ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడుతున్నాయి. నిజానికి […]

ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!

ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్‌ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]