వైసీపీ కంచుకోట…జగన్ సొంత గడ్డ కడపపై టీడీపీ ఈ సారి గట్టిగానే ఫోకస్ చేసింది. గత కొన్ని ఎన్నికల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో టిడిపి సత్తా చాటలేకపోతుంది. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు, 2014లో ఒక్క సీటు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. వరుసగా ఓడిపోవడంతో టీడీపీపై సానుభూతి […]
Author: Krishna
పేర్నిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీకి సపోర్ట్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ని ఎక్కువ తిట్టే వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాని..పవన్ కోసమే పెడతారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తన శాఖకు సంబంధించిన వివరాలని మీడియాకు చెప్పడం కంటే…పవన్ని ఎక్కువ తిట్టడంపైనే పేర్ని ఫోకస్ పెట్టేవారు. ఇక పవన్ సైతం అప్పుడప్పుడు పేర్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్-పేర్నిల మధ్య రాజకీయ […]
తెలంగాణ ఎన్నికల్లో సినీ నటులు..వారికి ఛాన్స్ లేదు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు […]
151 సిట్టింగులకు మళ్ళీ సీట్లు..జగన్కు రిస్కే.!
దమ్ముంటే టీడీపీ-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకెళుతుండటంతో..రెండు పార్టీలు అన్నీ స్థానాల్లో పోటీ చేయడం కుదరదు. అందుకే జగన్ అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇలా సవాల్ చేసి పరోక్షంగా టిడిపి-జనసేనలని రెచ్చగొట్టి..వారు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని, అప్పుడు తమకు లబ్ది చేకూరుతుందనే కాన్సెప్ట్ జగన్ది. కానీ జగన్ ట్రాప్ వర్కౌట్ […]
పెద్దిరెడ్డి అడ్డాలో లోకేష్..టీడీపీకి కష్టమే!
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు..గతంలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుకున్న మేర హైలైట్ కాలేదు గాని..ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి ఆయన హవా మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఆయనకు పట్టు పెరిగింది. వైసీపీలో టాప్ లీడర్లలో ఒకరిగా ఉన్న పరిస్తితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈయన చేతుల్లోనే ఉంది..అక్కడ రాజకీయాలని ఈయనే డిసైడ్ చేస్తున్నారు. జిల్లాని […]
దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!
టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టిడిపి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టిడిపి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]
మైలవరంపై వసంత పట్టు..దేవినేనికి మళ్ళీ రిస్క్!
మొన్నటివరకు మైలవరం వైసీపీ సీటు విషయంలో స్పష్టత రాలేదు..ఓ వైపు జోగి రమేష్, మరోవైపు వసంత కృష్ణప్రసాద్..ఇరువురి వర్గాల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. అయితే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం కావడంతో..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకే తన గ్రూపుని యాక్టివ్ చేశారు. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా జోగి వర్గం పావులు కదుపుతుంది. ఇదే […]
వైసీపీ రెబల్స్ మళ్ళీ గెలుస్తారా?
అధికార వైసీపీలో రెబల్స్ నాయకులు పెరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం, కొందరు నాయకులతో విభేదాల వల్ల ఇప్పటివరకు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సమస్యలపై ప్రశ్నిస్తే..సొంత పార్టీ వాళ్ళనే వైసీపీ సైడ్ చేస్తుంది. అలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..మొదటలోనే వైసీపీ నుంచి దూరం జరిగారు. ఆయన అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో జగన్ […]
గన్నవరంలో టీడీపీ అభ్యర్ధి ఎవరు?
మరొకసారి గన్నవరం రాజకీయాల్లో కీలక ట్విస్ట్ వచ్చింది. అనూహ్యంగా గన్నవరం టిడిపి ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు మరణించడంతో..కొత్త ఇంచార్జ్ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన అర్జునుడు కోమాలోకి వెళ్ళి..గురువారం మరణించారు. ఇక అర్జునుడు మరణంతో గన్నవరంలో మళ్ళీ టిడిపి అభ్యర్ధిని వెతుక్కునే పనిలో ఉంది. ఇక్కడ వరుసగా టిడిపి అభ్యర్ధులని మార్చాల్సిన పరిస్తితి వచ్చింది. 2009లో గన్నవరంలో టిడిపి నుంచి దాసరి బాలవర్ధనరావు గెలిచారు. కానీ 2014లో ఆయనకు సీటు ఇవ్వలేదు. గతంలో […]