సౌత్ టాప్ దర్శకుడులో శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది .. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు శంకర్ దర్శకత్వం లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి .. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. రోబో 2 సినిమాతో మొదలుపెట్టి తాజాగా వచ్చిన గేమ్ చేంజర్ వరకు శంకర్ నూంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి ..దాదాపు 22ఏళ్ల క్రితం వచ్చి భారతీయుడు సినిమా భారీ విజయ అందుకుంది .. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను ఘోరంగా నిరాశపరిచింది. ఇక ఇండియన్ టు సినిమా డిజాస్టర్ అవడంతో శంకర్ అభిమానులు నిరాశ పడ్డారు .. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సైతం అదే కొవలో డిజాస్టర్ గా మిగిలింది. దీంతో శంకర్ అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు .. దాంతో ఇప్పుడు శంకర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది .
ఇక శంకర్ ఏ హీరో తో సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎంతో ఇంట్రెస్ట్ గా మారిన క్వశ్చన్ .. దాంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ తెగ వాదించుకుంటున్నారు .. అయితే శంకర్ ఇప్పుడు విక్రమ్ కుమారుడు ధృవ్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది .. ఇప్పుడు ఇదే వార్త కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .. శంకర్ విక్రమ్ తో అపరిచితుడు , ఐ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకుతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది .. అయితే దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు
గేమ్ ఛేంజర్ తర్వాత ఆ యంగ్ హీరోను పట్టేసిన శంకర్ .. ఈసారైనా మెప్పిస్తాడా..?
