స్మార్ట్ ఫోన్ ముందు ద‌గ్గితే వ్యాధి తీవ్రత తెలిసిపోతుందట.. న్యూ టెక్నాలజీ ఇదే..!

కోవిడ్ 19 ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడి ఇబ్బంది పడ్డారు. కోవిడ్ 19 సోకిన చాలామంది వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో కొన్ని వారాల్లోనే కోలుకున్నారు. కొందరు మాత్రం పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిత్యం భారీ సంఖ్యలో ఈ కోవిడ్ వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ చికిత్స కు సంబంధించిన పలు పరిశోధనలు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త టెక్నాలజీని కూడా దీనికోసం వినియోగిస్తున్నారు.

తాజాగా దగ్గులో తేడాలను స్మార్ట్ ఫోన్లో కోవిడ్ వ్యాధి స్థాయిని అంచనా వేసే విధంగా స్పెయిన్ శాస్త్రవేత్తలు ఒక టెక్నాలజీని కనిపెట్టారు. బస్తినాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ కటాలోనియా నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ పరిశోధనలను చేపట్టారు. బసీలోనాలోని డల్‌మార్‌ హాస్పిటల్ లో చేరిన యాభై మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనూ స్మార్ట్ఫోన్లో నమోదు చేశారు. దగ్గు శబ్దంలో తేడాలని విశ్లేషించి కోవిడ్ వ్యాధి తీవ్రతను విశ్లేషించే విధానాన్ని రూపొందించారు. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ ఓపెన్ రీసెర్చ్ లో ఈ పరిశోధన ఫలితాన్ని ప్రచురించారు.

దీనివల్ల వ్యాధిని ఆరంభ దశలోనే కనిపెట్టడంతో పాటు దూర ప్రాంతాల్లోని రోగాలకు ఎల‌ర్ట్ చికిత్స చేయడం సాధ్యమవుతుంది. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సాధారణంగా ఉంటున్న పరికరం. రోగాలు తమ స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేసి పంపిన దగ్గులో తేడాలను వైద్యులు విశ్లేషించడం ద్వారా ఈ వ్యక్తిలో న్యూమోనియా తీవ్రతను కూడా లెక్కించేందుకు వీలవుతుందట. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య వసతులు లేని ప్రాంతాల్లో కూడా ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఈ టెక్నాలజీను ఇతర శ్వాస కోస వ్యాధుల రోగనిరోధకతకు కూడా ఉపయోగించవచ్చు. కోవిడ్ 19 రోగులు సత్వర గుర్తింపు ఐసోలేషన్ కు ఇది సహాయపడుతుంది.

తద్వారా సరైన వైద్య సంరక్షణ నియంత్రణ చర్యలు అమలు చేయడం సులభతరం అవుతుందని డాక్టర్ జాగ్వాలీన్ ఈ నివేదికను వెల్లడించారు. కోవిడ్ తో పాటు నిమోనియా వంటి ఇతర శ్వాస కోసం వ్యాధులతో బాధపడుతున్న రోగులు దగ్గులో తేడాని విశ్వసించి ఆ జబ్బు నిర్ధారణ చేయడం సులువు తరం అవుతుందని ఇందులో పార్టిసిపేట్ చేసిన సీనియర్ శాస్త్రవేత్త చెప్తున్నాడు. అయితే దీనిపై మరింత లోతైన అధ్యయనం జరిపి ఫలితాలను రోగుల భారీ డేటా తో ధృవీకరించిన తరువాత దీనిని వెల్లడించారట.