ఇటీవల అమెరికాకు చెందిన దిగ్గజ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ తమ కార్ల ప్లాంట్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. అందుచేతనే భారతదేశంలో ఈ కార్లు ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సనంద్ ,చెన్నై నగరాల్లో ఉన్న ఈ ప్లాంట్లను ఫోర్డ్ కంపెనీ మూసివేయడం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటంటే, కంపెనీకి భారీ నష్టాలు రావడం ..బహిరంగ మార్కెట్లో అభివృద్ధి లేకపోవడంతోనే ఫోర్డ్ కంపెనీ అధినేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఈ ఫోర్డ్ కార్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నా, దీని ధర కారణంగా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఇక దాదాపుగా కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఈ ఫోర్డ్ కార్లు అన్ని రకాల టెక్నాలజీలను కలిగి ఉన్నప్పటికీ, అత్యధిక ధర కారణంగా కొంతమంది ఇండియన్స్ కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఫోర్డ్ కంపెనీ తమ కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఏది ఏమైనా ఈ కంపెనీని మూసివేయడంతో భారతదేశంలో పలువురు ఉద్యోగస్తులు నిరుద్యోగులు కాక తప్పడం లేదు. చాలామంది ఉద్యోగాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.