సత్య నాదెళ్ల మరో ఘనత..!

స‌త్య‌నాదెళ్ల అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌ముఖ మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల ఇప్ప‌టికే ఎన్నో ఘనతలు సాధించారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో రికార్డు నెల‌కొల్పారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో స‌త్య నాదెళ్ల అధికార బాధ్యతలు బాగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న నాదెళ్ల ఇప్ప‌డు కంపెనీకి ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ సంస్థ‌కు కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్లను ఎంపిక‌చేసి నియ‌మిస్తూ బుధవారం ఆ కంపెనీ ఉత్త‌ర్వ‌లు జారీచేసింది. […]

ప్రముఖ నటుడు మృతి…!

సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్ప‌టి న‌టుడు అయిన చంద్ర‌శేఖ‌ర్ ఇక లేరు. రామాయణ్ ధారావాహికతో ఆయ‌న న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్ట‌ర్‌గా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్ర‌శేఖర్ కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బుధవారం ఉదయం త‌న సొంత ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. త‌న తండ్రి నిద్రలోనే మృతి చెందాడ‌ని, ఈ రోజు సాయంత్రం తండ్రికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చంద్ర శేఖర్ కొడుకు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోనే 1923లో జ‌న్మించిన చంద్రశేఖర్ నటనపై […]

పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?

ప్ర‌స్తుతం ఇండియాలో గ్రూప్‌-1కి ఉన్న ప్రాముఖ్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జ‌రిగిన విస‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దీనిపై విచార‌ణ జ‌రిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థల‌కు టీసీఎస్ […]

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో స్టూడెంట్ల‌కు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో ఇంట‌ర్‌సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ కూడా ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల […]

కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]

ఉత్తరప్రదేశ్ లో శవాల ప్రవాహం..కారణం ఏమిటంటే..?

క‌రోనా మ‌ర‌ణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర భార‌త‌దేశంలో దీని తీవ్ర‌త తారా స్థాయిలో ఉంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అయితే క‌రోనా మృత‌దేహాల‌ను క‌న‌నం చేయ‌డానికి ప్లేస్ లేక ఎక్క‌డ బ‌డితే అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదే క్ర‌మంలో గంగాన‌ది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాల‌ను క‌ప్పిపెడితే అప్ప‌ట్లో ఇవ‌న్నీ న‌దిలోకొట్టుకు రావ‌డం పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అదే స్థాయిలో క‌రోనా […]

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్‌ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్‎ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]

పుష్ప ఐటెం సాంగ్ లో దిశా పటాని…?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ఇటీవల ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో […]

బ్రేకింగ్ : ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌కు బెయిల్..!

గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక […]